ADD

Tuesday 5 April 2016

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

తెలంగాణా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దమయ్యారు. ఇందులో బాగంగా తెలంగాణా మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకునేందుకు కెసిఆర్ సిద్దమయ్యారని తెలుస్తుంది. బిజేపి నుండి ఎమ్మెల్యే లక్ష్మన్,ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ల పేర్లను మంత్రివర్గం లోకి తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు దపాలుగా మోడీ తో చర్చలు జరిపిన కెసిఆర్ బిజేపితో దోస్తీకి రాష్ట్రం నుండే పునాది వేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి తో పొత్తుతో నష్టమే అని భావిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకత్వం కి టిఅరేస్ సరైన ప్రత్యామ్నాయమని కెసిఆర్ సంకేతాలు పంపుతున్నారు. కెసిఆర్ సంకేతాలతో రాష్ట్ర బిజేపి నాయకత్వం కూడా ఆ దిశగా చర్చలు సాగిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకోగానే కేంద్రంలో టిఅరేస్ కి ఒక క్యాబినెట్,రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 


పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కెసిఆర్ కి ప్రశంసల జల్లు

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కెసిఆర్ కి ప్రశంసల జల్లు 



తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.కెసిఆర్ ప్రజెంటేషన్ ప్రపంచంలోనే ప్రథమం అనుకుంటా,అద్బుతం కెసిఆర్ ప్రజెంటేషన్ అని పారిన్ కరస్పాండెన్స్ క్లబ్ అధ్యక్షుడు కెసిఆర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. భారతదేశం లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి డైనమిక్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ముఖ్య అతిదిగా ఆహ్వానించడం సంతోష దాయకం. ఈ రకంగా మిమ్మల్ని ప్రపంచ మీడియాకి పరిచయం చేయబోతున్నాం,ఈ సందర్బంగా ఢిల్లీ లో తమ సంస్థ సభ్యులకు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు,సంక్షేమ పథకాలు,తెలంగాణా ప్రభుత్వం తక్కువ సమయంలో సాదించిన విజయాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సంస్థ అధ్యక్షుడు వెంకట నారాయణ లేఖలో పేర్కొన్నారు,1958లో ఏర్పడిన ఈ సంస్థలో దక్షిణాసియా దేశాలకు  చెందిన ప్రముఖ వార్త పత్రికలు,మీడియా చానళ్లు,మ్యగజిన్లు లకు చెందిన 500మంది ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. 

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

ఒక్కరోజు 25సంస్థలు,2,700కోట్ల పెట్టుబడులు 27000ఉద్యోగాలు 

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉన్న తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజే 25ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. ఐటీ పాలసీ ప్రకటించిన తొలి రోజే యెస్ బ్యాంక్,హెచ్పీఈ,టిఐఈ,ఇన్సైడ్ వ్యూ,టాలెంట్ స్ప్రింట్,సిస్కో,సాప్ ఎడ్యుకేషన్,మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్,సీ-డాక్,యునివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్,ఐసీఐసీఐ ఫౌండేషన్ వంటి 25సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా,ఇందులో బాగంగా 2,700కోట్ల పెట్టుబడులు రానుండగా,27500మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రకటించిన తొలి రోజే తెలంగాణా ఐటీ పాలసీ లక్ష్య సాదన దిశగా ముందడుగు పడింది. 


పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ'

పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ' 

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణా నిన్న ప్రపంచ అత్యుత్తమ ఐటి పాలసీ ని అతిరథుల సమక్షంలో నిన్న ఆవిష్కరించారు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు వి.కె సారస్వత్,ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి,ముఖ్యమంత్రి కెసిఆర్,డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి,మంత్రులు నాయిని,తారకరామారావు,తెలంగాణా ప్రభుత్వ అధికారులు పాల్గొనగా తెలంగాణా ఐటి పాలసీ లో బాగంగా మరో నాలుగు సబ్ పాలసీలను ఆవిష్కరించారు.తెలంగాణా ఐటీ పాలసీ తో పాటు తెలంగాణా ఇన్నోవేషన్ పాలసీ ,రూరల్ టెక్ పాలసీ,ఎలక్ట్రానిక్ పాలసీ,ఇమేజ్ అండ్ గేమింగ్ పాలసీలను ఆవిష్కరించారు. తెలంగాణా ఐటీ పాలసీ పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉందని కార్యక్రమానికి హాజరైన ఐటీ నిపుణులు పేర్కొన్నారు.  ఇందులో బాగంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం చిత్తసుద్దితో పనిచేస్తుందని,ప్రపంచ అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో 8నెలల కాలంలోనే 1691కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని,అన్నివిధాల తెలంగాణా ఐటి పెట్టుబడులకు అనుకూలం అని కెసిఆర్ పేర్కొనగా,నారాయణ మూర్తి దేశం లోని ప్రతి పట్టణం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలతో పోటీ పడాలని,ప్రతి నిర్ణయం పారదర్శకంగా,వేగంగా,ఓపెన్ మైండ్ తో ఉండాలని సూచించారు.