ADD

Thursday 31 March 2016

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 


ఆరు దశాబ్దాల అన్యాయాన్ని కడిగేస్తూ తెలంగాణా కర్షకుల సాగునీటి కష్టాలను తీర్చేలా కర్షకులకు సాగుపై ఆశను పెంచేలా తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గోదావరి,కృష్ణమ్మ ల నీళ్లను తెలంగాణా బీడు భూములకు మరల్చి తెలంగాణాను సస్యశ్యామల హరిత తెలంగాణాల,అన్నపూర్ణలా మార్చేలా తెలంగాణా ప్రాజెక్టుల రీడిజైన్ సామాన్యులకు సైతం సులభంగా అర్ధం అయ్యేలా సవివరంగా వివరించారు ముఖ్యమంత్రి కెసిఆర్. 
1956నాటికే తెలంగాణాలో సాగునీటి విస్తీర్ణం 20లక్షల ఎకరాలు,అప్పటికే ప్రపంచంలోనే ప్రఖ్యాత మేజర్ సాగునీటి ప్రాజెక్టు నిజాం సాగర్,వాటర్ షెడ్ పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కాకతీయ,రెడ్డి రాజులే అలాంటి పరిస్థితులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణాలో ఈ ఆరు దశాబ్దాల ఆంధ్రా పాలకుల ఆదరణకు నోచుకోక దగాపడ్డ తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల కథ 'రాస్తే రామాయణం-మాట్లాడితే మహాభారతం' అంటూ మొదలెట్టిన కెసిఆర్ ప్రజెంటేషన్ దుమ్ముగూడెం,ప్రాణహిత-చేవెళ్ల,పాలమూరు,తుమ్మిడిహెట్టి ఇలా తెలంగాణాలోని ప్రాజెక్టు ఏదైనా ఆంధ్ర పాలకుల నిరంకుశ దోరనితో ప్రతి ప్రాజెక్టు డిజైన్ తెలంగాణాకి ప్రయోజనం లేకుండా,పక్క రాష్ట్రాలతో జల వివాదాలు వచ్చేలా,పర్యావరణ కొర్రీలు మొదలయ్యేలా చేసిన తీరు సుస్పష్టంగా వివరించిన కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ తో తెలంగాణా లో కోటి ఎకరాలకు సాగునీరు ఎలా ఇవ్వబోతున్నారో వివరించారు. 
ఖమ్మం జిల్లా తో మొదలెట్టిన కెసిఆర్ ఇందిరా,రాజీవ్ సాగర్ కాలువలకు రీడిజైన్ చేసి,దేవాదుల ప్రాజెక్టు ద్వారా కంతనపల్లి ప్రాజెక్టు రిడిజైన్ చేసి స్థలం తుపాకుల గూడెం కొత్తూరు వద్ద ప్రాజెక్టుతో అంతరాష్ట్ర జలవివాదాలు లేకుండా ఖమ్మం జిల్లాలో 6,20000ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పంతో ఉన్నామని,దుమ్ముగూడెం నుండి 60టిఎంసీ నీళ్లు తీసుకుని 19టిఎంసి సామర్ధ్యంతో రోల్లపాడు ప్రాజెక్టుతో వరంగల్ కి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పాలమూరుకు కల్వకుర్తి ద్వారా వచ్చే సీజన్ నాటికే లక్షా 50వేల ఎకరాల కు సాగునీరు,జోన్నలబోడ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తో పూర్తిస్థాయిలో 3లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తూ ,భీమా ,నెట్టెంపాడు ఎత్తిపోతల ,ఆర్దిఎస్ దిగువ భాగాన్ని తుమ్మల లిఫ్ట్ తో,పాలమూరు ఎత్తి పోతలలో బాగంగా శ్రీశైలం రిజర్వాయర్ -కల్వకుర్తి లిఫ్ట్-ఎల్లూరు లిఫ్ట్-నార్లాపూర్ ప్రాజెక్టు-ఏదుల రిజర్వాయర్-ఎట్టెం రిజర్వాయర్-కరివేర-ఉద్దండాపూర్రిజర్వాయర్-కొండుడుకు లక్షిమిదేవి పల్లి రిజర్వాయర్-అనంతారం రిజర్వాయర్ లతో పాలమూరును సస్యశ్యామలం చేయనున్నామని వివరించారు. నల్గొండ జిల్లాకు ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు,దిండి రిజర్వాయర్ తో నిజామాబాద్ నుండి గ్రావిటీతో నల్గొండ లోని మునుగోడు,దేవరకొండ లకు నీల్లిస్తూ,చుటుప్పాల్ వరకు నీటిని తీసుకెళ్ళి 20 టిఎంసి లతో హైదరాబాద్ కి తాగునీటి అవసరాలకు ఒక రిజర్వాయర్ నిర్మించనున్నామని తెలిపారు. 
తెలంగాణా కాశ్మీర్ గా పేరుగాంచిన ఆదిలాబాద్ ని సస్యశ్యామలం చేసేందుకు ఆరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన రోలివాగు,మత్తడివాగు,నీల్వాయి,జగన్నాత్పూర్,కొమురం భీం ప్రాజెక్టులు,సదరం మాటు బ్యారేజీ ద్వార ఆదిలాబాద్ కి సాగునీటి కష్టాలు తీరుస్తామని ,గంగనాల ప్రాజెక్టు ద్వార కోరుట్ల కు,కడెంపై 6.5టిఎంసి సామర్ధ్యంతో కుట్టెం రిజర్వాయర్ తో ఇచ్చోడ,బోథ్ ప్రాంతాలకు సాగునీరు అందించనున్నామని,50ఏళ్ల నిరీక్షణ అయిన లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు కు మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్నందున చనఖ-కొరటా బ్యారేజీ ద్వారా 52వేల ఎకరాలకు సాగునీరు,బాసర వద్ద చెక్ డ్యాం,ప్రాణహిత-చేవెళ్ల కి బదులు తుమ్మిదిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి1651 టిఎంసి ల లభ్యత ఉండే కాళేశ్వరం (మేడిగడ్డ)బ్యారేజీ ఇందులో బాగంగా అన్నారం(3.6),చెందుల్ల బ్యారేజీ(5),మేడారం(3)మల్కపేట్(3.5),అనంతగిరి(3.5),హిమామ్ బాద్(0.8),మల్లన్న సాగర్(50)పాముల పర్తి(21),బస్వాపూర్(14),ఆలేరు(10),గుజ్జి(1.5),తల మట్ల (5)తమ్మక్కపల్లి (3),కాచాపూర్ (2.5)కామారెడ్డి(2.5),మంచిప్ప(5),షామీర్ పేట్ 20 టిఎంసి సామర్ధ్యం తో రిజర్వాయర్లతో కరీంనగర్,మెదక్,నిజామాబాద్,రంగారెడ్డి లకు సాగునీరు అందించనున్నామని,రాయపట్నం వంతెన నిర్మాణం అనంతరం ఎల్లంపెల్లి ప్రాజెక్టు పూర్తి అయినందున బ్యాక్ వాటర్ తో ఎల్లంపెల్లి-ధర్మపురి-జైన వరకు నిత్యం నీరు నిల్వ ఉండనుంది,ఎల్లంపెల్లి నుండి నీటిని లిఫ్ట్ తో మిడ్ మానేరు-మల్లన్న సాగర్-సింగూరు-నిజాం సాగర్-ఎస్సారెస్పీ నీటిని లిఫ్ట్ తో నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ సస్యశ్యామలం కానుందని ప్రాజెక్టుల రిడిజైన్ తో ఆరు నూరైన ఎవరు అడ్డొచ్చిన కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ప్రకటించారు.  


దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం లో ప్రతిదీ కులం,మతం,దనిక,పేద గా విడదీస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతున్న పాలకులు ఇప్పుడు దేశ ప్రతిష్టాత్మక అవార్డులకు సైతం కుల కళంకం అంటగట్టటానికి పూనుకోవడం చాల విచారకరం. అవార్డులలో వెనుకబడిన వర్గాలకు చోటు లేకపోవడం విచారకరమే కానీ ఇలా దేశ ప్రతిష్టను పెంచిన నిష్ణాతులను అవార్డుకు ఎంపిక చేసిన తరువాత వారిని కులాల వారిగా విడదీయడం ఎంత వరకు సమంజసం. అవార్డులకు ఇప్పటికే రాజకీయ రంగు పులిమిన నాయకులు ఇప్పుడు కులం రంగు పులమడం ఈ దేశం ఎంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో తెలుస్తుంది. 

చారిత్రాత్మకం చంద్రశేఖరుడి నిర్ణయం అసెంబ్లీ లో నేడే చంద్రశేఖరుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్

చారిత్రాత్మకం చంద్రశేఖరుడి నిర్ణయం 

అసెంబ్లీ లో నేడే చంద్రశేఖరుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ 

సామాన్యుడికి సైతం సాగునీటి వ్యవస్థ అర్ధమయ్యేలా... సాగునీటి నిపుణులు సైతం శబాష్ అనేలా... పుడమితల్లి పులకించిపొయెలా... చారిత్రాత్మక రీతిలో ఓ కొత్త సాంప్రదాయానికి తెర తీస్తూ ఓ ఉద్యమ సారధి ,స్వరాష్ట్ర సారధి,తెలంగాణా రథ సారధి,తెలంగాణా పెద్ద రైతు తెలంగాణా అసెంబ్లీలో గత ప్రభుత్వాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలోని లోటుపాట్లు ,తెలంగాణా కి ఉపయోగపడని రీతిలో డిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టులు,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన రిడిజైన్ వల్ల ఉపయోగాలు,తెలంగాణా ప్రాంతంలో గోదావరి,కృష్ణా నదుల నీటి లభ్యత,నీటిని ఏవిదంగా వాడుకుని తెలంగాణాని సస్యస్యామలం చేయాలి,తెలంగాణాలోని కోటి ఎకరాలకు ఏవిధంగా సాగునీటిని అందివ్వనున్నారు కూలంకషంగా క్షుణ్ణంగా క్లియర్గా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

Wednesday 30 March 2016

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమెజాన్ క్యాంపస్ కి శంకుస్థాపన

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమెజాన్ క్యాంపస్ కి శంకుస్థాపన

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమేజాన్ క్యాంపస్ కి మంత్రి కేటిఅర్ చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా బయట అతిపెద్ద అమేజాన్ క్యాంపస్ హైదరాబాద్ లోనే కావడం దీని ప్రత్యేకత 2019కల్లా దీని నిర్మాణం పూర్తి కానుంది. పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తయితే 10000మందికిపైగా ఉపాధి దొరకనుంది. 

భానుడి భగభగలు... దంచుతున్న ఎండలు...

భానుడి భగభగలు... దంచుతున్న ఎండలు... 

తెలంగాణా పై భానుడి ప్రతాపం కొనసాగుతుంది,భానుడి భగభగలతో ఎండలు దంచుతుంటే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ రాబోతున్న మండే ఎండాకాల నెలలపై ఉహాలకు అందని భయాన్ని పెంచుతుంది. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా నిజామాబాద్ 41.1,ఆదిలాబాద్ 40.3,మెదక్ 40,రామగుండం 39.6,వరంగల్ 39.8,నల్గొండ39,బద్రాచలం 38.8,మహబూబ్ నగర్ 38.7,ఖమ్మం 38.2,హైదరాబాద్ 38.5,హాకీంపేట్ 37.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఉపాధి కూలీలు,విద్యార్థులు,ఉద్యోగులు,ప్రజలు భయటకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. 

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాడు ఆ మంత్రిని కొట్టాడట....! అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు తీరు

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాడు ఆ మంత్రిని కొట్టాడట....!

అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు తీరు 

నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం సహచర మంత్రులపై ఎలా ఉండేదో ఈరోజు అసెంబ్లీలో బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. తెలంగాణాలో కరువు పరిస్థితులపై చర్చ సందర్బంగా జరిగిన చర్చలో 'నాడు నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణకు ముందు కమిటీ సభ్యులు,అధికారులు,మంత్రులతో చంద్రబాబు సమావేశమైనప్పుడు నేను షుగర్ ప్యాక్టరీని ప్రైవేటీకరణను వద్దని చేతులు ఎత్తి వేడుకుంటూ బతిమాలితే అసహనానికి గురైన చంద్రబాబు నా తొడపై కొట్టారని తోడంత ఎర్రగా కందిపోయింది,సమావేశ అనంతరం చంద్రబాబు తనని మరల పిలిపించుకుని  క్షమించమని అంటే మీరు కొట్టిన దెబ్బ నా తొడపై కాదు నా గుండెపై తగిలిందని చంద్రబాబు తో అన్నా నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపలేదు అలా ఉండేది ఆనాడు ముఖ్యమంత్రి తీరు మంత్రులపై'అని నాటి పరిస్థితులను ,చంద్రబాబు తీరును బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. 

ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం

       ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం 


తెలంగాణా పారిశ్రామిక విధానం టిఎస్-ఐపాస్ తో ఎనిమిది నెలల సమయంలోనే ప్రపంచం ద్రుష్టి తెలంగాణా వైపు తిప్పి 30000కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించిన తెలంగాణా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రపంచ అత్యుత్తమ ఐటీ విధానం ఏప్రిల్ 4న ఐటీ దిగ్గజాల నడుమ ప్రపంచానికి ప్రకటించనుంది.ప్రపంచ ఐటీ కేంద్రంగా తెలంగాణాను నిలపాలనే దృడ నిశ్చయంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విజ్ఞప్తి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా విస్తరించి ఉన్న ఐటీ రంగాన్ని తెలంగాణాలోని కరీంనగర్,వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలి,హైదరాబాద్ లో నిర్మించిన అంకుర కేంద్రం 'టి-హబ్' రెండో కేంద్రాన్ని హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలి. నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ లో ఐటీ పరిశ్రమల విస్తరణకు రాయితీలు,మౌలిక వసతులను,పెట్టుబడి రాయితీలు కల్పించాలి.ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా వంటి స్వదేశీ ఐటీ దిగ్గజాలతో, బిపీవో కాల్ సెంటర్లు,ఎంఎన్సీ లతో తెలంగాణా లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ డ్రైవ్ లు నిర్వహించాలని,ఐటి పాలసీలో తెలంగాణా ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుతూ తెలంగాణా పునర్నిర్మాణానికి  అంకుటిత దీక్షతో ముందుకేల్తున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మీ శ్రేయోభిలాషులు.        
---వేముల కర్ణాకర్ రెడ్డి (తీగెల ధర్మారం,ధర్మపురి,కరీంనగర్)

చంద్రబాబు చంద్రశేఖరుడికి భయపడుతున్నాడా???

చంద్రబాబు చంద్రశేఖరుడికి భయపడుతున్నాడా???

నిన్న ఆంధ్ర అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా ఆసక్తికర వాఖ్యలు చోటు చేసుకున్నాయి చర్చలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ 'తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర తో జలవివాదాల పరిష్కారం కోసం చర్చలతో ఒప్పందాలు కుడుర్చుకుంటుంటే,కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఆంధ్ర ముఖ్యమంత్రి మాత్రం చొరవ తీసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు సరికదా తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలకు వెలితే ఎక్కడ ఓటుకు నోటుకు కేసును తిరగేస్తాడెమో అని చంద్రబాబు భయపడుతున్నారని వాఖ్యానించగా అందుకు స్పందనగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి వారం కోర్టుల చుట్టూ తిరుగుతుంది ఎవరో??భయపడేదేవరో??అని వాఖ్యానించారు. 

కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్న యువరాజు

కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్న యువరాజు 

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యువ మంత్రి కేటిఅర్ నిన్న కేంద్ర మంత్రులతో బిజీ బిజీగా మంతనాలు జరిపారు విబజన చట్టంలోని హామీలు,తెలంగాణాకి అభివృద్ధి నిధులు,మరికొన్ని పనులపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,వెంకయ్య నాయిడు,బీరేంద్ర సింగ్ లతో బేటీ అయ్యారు. తొలుత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బేటీ అయిన కేటిఅర్ తెలంగాణా సర్కార్ జిల్లాలు,మండలాల పునర్వ్యవస్తీకరణ చేపట్టనున్న నేపధ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీ ప్రకారం నియోజకవర్గాల పెంపు త్వరగా చేపట్టాలని,ఐపిఎస్ ,ఐఎఎస్ ల కొరత దృష్ట్యా నియమాకాలు జరిపి తెలంగాణాకి ఐపిఎస్ లను 141కి పెంచాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో సమావేశమైన కేటిఅర్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణాను పరిగణలోకి తీసుకోవాలని కోరిన కేటిఅర్ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ బగీరథ పనులను పరిశీలించటానికి మంత్రి గారిని ఆహ్వానించారు,అలాగే తెలంగాణకు సంబంధించి 3వేల కోట్ల అభివృద్ధి పనులకు ,172రోడ్డు అనుసందాన వంతేనలకు 500కోట్లు కేటాయించాలని కోరారు. 

నేడో రేపో 1000పోస్టులతో గ్రూప్-2 రీనోటిఫికేషన్???

నేడో రేపో 1000పోస్టులతో గ్రూప్-2 రీనోటిఫికేషన్???

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో వాయిదా పడ్డ గ్రూప్-2పరీక్ష కు రీనోటిఫికేషణ్ వేయటానికి టిఎస్పిఎస్సి సిద్దమవుతుంది. గ్రూప్-2స్థాయి ఖాళీలను గుర్తించిన అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం అందించడంతో 1000పోస్టుల తో నేడో రేపో గ్రూప్-2కి రీనోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలో 500పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ కి 5లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోస్టులను పెంచుతూ వెలువడనున్న గ్రూప్-2నోటిఫికేషన్ కోసం లక్షలాది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త;రెండు రోజుల్లో షెడ్యుల్డ్???

డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త;రెండు రోజుల్లో షెడ్యుల్డ్???

తెలంగాణాలో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ రెండు,మూడు రోజుల్లో డిఎస్సీ షెడ్యుల్డ్ విడుదల చేయటానికి సన్నాహకాలు చేస్తుంది. వారం క్రితం విడుదలైన టెట్ కి 3లక్షలకు పైగా దరకాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,000టీచర్ పోస్టుల బర్తీకి షెడ్యుల్డ్ విడుదల చేయనుంది. ఇప్పటికే డిఎస్సీ ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు చేరింది,నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సైతం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tuesday 29 March 2016

ఉద్యమ చరిత్ర ప్రస్పుటించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం'???

ఉద్యమ చరిత్ర ప్రస్పుటించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం'??? 

అరవై ఏండ్ల తెలంగాణా ఉద్యమ చరిత్ర,తెలంగాణా పూర్వ చరిత్ర ,తెలంగాణా సాంస్కృతిక వారసత్వం,సంప్రదాయాలు ఒకే చోట కళ్లకు కట్టినట్టు ప్రస్పుతించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం' నిర్మించాలని కెసిఆర్ యోచిస్తున్నారు. తెలంగాణా తొలితరం ఉద్యమ అమరవీరుడు బద్రివిశాల్ పన్నాలాల్ 88వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ 1969తెలంగాణా ఉద్యమం మొదలు 2009మలి దశ ఉద్యమం ,తెలంగాణా రాష్ట్ర సాధన వరకు తెలంగాణా చరిత్రలోని కీలక ఘట్టాలు,అమరవీరుల త్యాగాలు,తెలంగాణా సంస్కృతి,చరిత్ర ఒకే చోటే ఉండేలా తెలంగాణా నడిబొడ్డున 'తెలంగాణా స్మారక కేంద్రం' ఏర్పాటు చేస్తామని,ఇందుకు సంబందించిన మరిన్ని విషయాలను అధికారులతో చర్చించి వెల్లడిస్తానని కెసిఆర్ ప్రకటించారు. 

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు 

2014ఎన్నికల ముందు కేంద్రంలో మోడీ గాలి వీస్తుంటే తెలంగాణాలో కెసిఆర్ నామస్మరణ జరుగుతుంది అలాంటి సమయంలోనే ఆంధ్రలో మాత్రం జగన్ హవా అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితి మారాలంటే ఎలాగైనా మోడీ తో దోస్తీ తప్పనిసరి అని బిజేపీ రాష్ట్ర నాయకత్వం వద్దంటున్న చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడి ప్రయత్నం ,వెంకయ్య నాయిడి మధ్యవర్తిత్వం,చంద్రబాబు చతురతతో టిడిపి,బిజేపీ పొత్తు కుదిరింది వీరిరువురికి తోడు పవన్ జతకలవడంతో ఆంధ్రలో అధికార పీఠం ఎక్కారు చంద్రబాబు,ఈ పొత్తుతో బీజేపీకి ఒరిగేదేమీ లేకపోయినా పొత్తుల మిత్రదర్మం తో టిడిపికి కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చారు మోడీ ,ఆంధ్ర కి ఇచ్చిన హామీ ప్రకారం ఐఐటి,ఐఐఎమ్,ఐఐఐటి,ఐఐఎస్టి లాంటి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు కుమ్మరించింది. మరెన్నో అభివ్రుద్ది నిధులను కేటాయించింది,కానీ చంద్రబాబు ఆడంబరాలు ,పబ్లిసిటీ స్టంట్స్,బాబు అండ్ కో అవినీతి తో నిధుల దుర్వినియోగం గ్రహించిన కేంద్ర సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ విషయం పక్కన పెట్టింది. స్వయంగా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతో తను కేంద్రం చేతిలో చిక్కాడు ఇదిలా ఉండగా మధ్యలోకి చంద్రశేఖర్ రావు ప్రవేశించాడు. కేంద్రానికి ఇప్పటికిప్పుడు కెసిఆర్ అవసరం లేకపోయినా బావిష్యత్తులో కచ్చితంగా అవసరం అవుతుంది. తెలంగాణా లో సంక్షేమ కార్యక్రమాలతో తిరుగులేని ప్రజాదారనతో ముందుకేల్తుంటే చంద్రబాబు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. అందుకే కేంద్రం చంద్రబాబుని పొమ్మనలేక పోగాబెట్టలేక సహాయనిరాకరణ చేస్తూ చంద్రశేఖరునికి దగ్గరవుతూ ఆహ్వాన మాటల మంత్రాంగాలు కొనసాగిస్తూ ఉంది. 

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో హైటెక్ టవర్స్;సైబర్ టవర్స్ ని తలదన్నేలా హైటెక్ టవర్స్

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో హైటెక్ టవర్స్;సైబర్ టవర్స్ ని తలదన్నేలా హైటెక్ టవర్స్ 

తెలంగాణా ఐటీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించాలని ప్రయత్నిస్తున్న సర్కార్ తెలంగాణకే తలమానికంగా నిలిచిన సైబర్ టవర్స్ ని మించిన మరో హైటెక్ సిటీ నిర్మాణానికి తెలంగాణా సర్కార్ సిద్దమైంది ఏప్రిల్ 4న తెలంగాణా ఐటీ విధానాన్ని ప్రకటించనున్న సర్కార్ అందులో హైటెక్ సిటీ నిర్మాణానికి సంబందించిన వివరాలను తెలపనున్నారు. కార్పోరేట్ ప్రాంగణాలకు మిన్నంగా మౌలిక సదుపాయాలతో తెలంగాణాలోని 500చిన్న ఐటీ కంపెనీలకు ఉపయోగపడేలా ఈ టవర్స్ నిర్మించనుంది. అలాగే ప్రస్తుతం మాదాపూర్,గచ్చిబౌలి,నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నఐటీ పరిశ్రమని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో ఐటీ కారిడార్ విస్తరించనున్నట్లు తెలంగాణా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4న ప్రకటించనున్న ఐటీ పాలసీలో 50లక్షల నుండి 5కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న ఐటీ కంపెనీలకి రాయితీ కల్పించనుంది. 

Monday 28 March 2016

తెలంగాణా వ్యాప్తంగా మరిన్ని షీ టీమ్స్

తెలంగాణా వ్యాప్తంగా మరిన్ని షీ టీమ్స్ 

ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కొండా సురేఖ షీ టీం ల పనితీరు ,మరిన్ని షీ టీం లను ఏర్పాటు చేయాలని అడిగిన ప్రశ్నకు హోం మంత్రి నాయిని నరశింహ రెడ్డి సమాధానమిస్తూ ప్రస్తుతం తెలంగాణాలోని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు షీ టీం లను ఏర్పాటు చేసామని ,షీ టీం ల ద్వారా ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న వారిపై 315కేసులు నమోదు చేసామని ,172మందిని అరెస్టు చేసామని ,ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 2,400మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని,పదే పదే ఈవ్ టీజింగులకు పాల్పడుతున్న వారిపై నిర్భయ కేసులు పెడుతున్నామని,త్వరలోనే తెలంగాణాలోని ప్రదాన నగరాలు,పట్టణాలలో షీ టీం లను ఏర్పాటు చేస్తున్నామని,కొండా సురేఖ తెలంగాణా వ్యాప్తంగా మహిళా పోలిస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని,ప్రతి స్టేషన్లలో మహిళా డేస్కులను ఏర్పాటు చేయాలని,షీ టీం లలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలని అడగగా ఇందుకు మంత్రి నాయిని నరశింహ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 

పోలిస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఏప్రిల్ 24

పోలిస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఏప్రిల్ 24

ఆర్ఆర్బి పరీక్ష  కారణంగా ఏప్రిల్ 3న జరగాల్సిన వాయిదా పడిన తెలంగాణా పోలిస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 24న నిర్వహించాలని తెలంగాణా పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షను మధ్యాహ్నం 2నుండి 5వరకు నిర్వహించాలని ,ఈ నెల జరగాల్సిన ఎస్సై రాత పరీక్షను యదాతదంగా ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో వాయిదా పడ్డ గ్రూప్-2పరీక్ష పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో టిఎస్పిఎస్సి బోర్డు సమావేశం నిర్వహించి గ్రూప్-2పరీక్షపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

తెలుగు చలనచిత్రాలకు 3జాతీయ అవార్డులు;బాహుబలికి రెండు ,కంచె సినిమాకి ఒకటి

తెలుగు చలనచిత్రాలకు 3జాతీయ అవార్డులు;బాహుబలికి రెండు ,కంచె సినిమాకి ఒకటి



ఈరోజు ప్రకటించిన 63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలకి మూడు అవార్డులు దక్కాయి. తెలుగు చలనచిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన బాహుబలి సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగ,ఇదే సినిమాకి ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో అవార్డు గెలుచుకోగా, కంచె సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర క్యాటగిరీలో జాతీయ అవార్డు గెలుచు కుంది. జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది. ఎస్. ఎస్ . రాజమౌళి దర్షకత్వంలో రానా ,ప్రభాస్,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ,నాజర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కింది.గత ఏడాది రిలీజ్ అయిన బాహుబలి కలెక్షన్ల రికార్డులను దుమ్ముదులుపుతూ 600కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా,రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యం లో క్రిష్ దర్షకత్వంలో వరుణ్ తేజ్ ,ప్రగ్యా జైస్వాల్  హీరో ,హీరోయిన్లు గా తెరకెక్కిన కంచె సినిమా విమర్షకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

చంద్రబాబుకు మరో జలక్ తప్పదా???నేను సైతం అంటున్న రేవంత్ రెడ్డి???

చంద్రబాబుకు మరో జలక్ తప్పదా???నేను సైతం అంటున్న రేవంత్ రెడ్డి???

తెలంగాణాలో 2019లో అధికారం టిడిపి దే,నేనే ముఖ్యమంత్రి అంటూ కలలు కన్న రేవంత్ ఆశలు కలలుగానే మిగిల్చేలా తెలంగాణాలో టిడిపి పార్టీయే కనుమరుగై పోతుండటంతో ఏమి  తోచని పరిస్థితిలో పడిపోయాడు రేవంత్. ఇక టిడిపిలో ఉంటే రాజకీయ జీవితం అగమ్యగోచరమే అనుకుంటున్న రేవంత్ చంద్రబాబుని వదిలే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ మారటానికి సిద్దపడిన రేవంత్ జాతీయ పార్టీ అయిన బిజేపి,తెలంగాణా లో అధికార పార్టీ అయిన టిఅరేస్ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఫైర్ బ్రాండ్ లా వ్యవహరించే రేవంత్ ఈ సమావేశాల్లో కొంత స్పీడ్ తగ్గించాడు. టిడిపికి ప్రస్తుతం తెలంగాణాలో పెద్దదిక్కుగా ఉన్న రేవంత్ సైతం పార్టీ మారితే ఇక అంతే సంగతులు. 

ఉత్తమ జాతీయ చలనచిత్రం 'బాహుబలి' భళా బాహుబలి

ఉత్తమ జాతీయ చలనచిత్రం 'బాహుబలి' 

భళా బాహుబలి



తెలుగు చలన చిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చి రికార్డుల దుమ్ముదులిపిన దర్శక జక్కన రాజమౌళి చెక్కిన శిల్పం బాహుబలి 63వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ జాతీయ చలన చిత్రంగా ఎంపికైంది. ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల ప్రకటనలో బాహుబలి ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రంగా బాహుబలి రికార్డు కెక్కింది. 600కోట్ల రికార్డు కలెక్షన్లతో రికార్డుల దుమ్ము దులిపిన బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపిక పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తుంది. రాజమౌళి దర్శకుడిగా ప్రభాస్ ,రానా,అనుష్క ,రమ్యకృష్ణ ,నాజర్ ,తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి టీం ప్రస్తుతం భాహుబలి-2 చిత్రీకరణం లో ఉంది. 

చిక్కుల చంద్రుడు...! నరేంద్రుడు నిదులివ్వకపోవడానికి కారణం అదేనా???

చిక్కుల చంద్రుడు...!

నరేంద్రుడు నిదులివ్వకపోవడానికి కారణం అదేనా???

2014ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా,ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఉదరగోట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొన్ని రోజులు మభ్యపెట్టాడు ,అనంతరం మరచిపోయాడు,ఇక ప్రత్యేక హోదా విషయమే మరిచాడు. కేంద్రం పై ఒత్తిడి పెంచుతాడానుకుంటే ఒత్తిడిలో చిత్తవుతున్నాడు. కేంద్రం కూడా చంద్రబాబు పనితీరును పరిశీలిస్తూనే ఉన్నారు. ఏపనైనా అట్టహాసం,పబ్లిసిటీ లేకుండా చేయని తత్వం,దుబారా ఖర్చు,కేంద్రం కేటాయించిన నిధులకు యుటిలైజేషన్ సర్టిపికెట్లు(నిధుల వినియోగ పత్రాలు) కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా పైగా కేంద్ర నిధుల పనుల్లో అవినీతికి తావిస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం లేదని కేంద్ర వర్గాల సమాచారం. 

Sunday 27 March 2016

విజయ విరాటపర్వం;సెమీస్ లో భారత్

విజయ విరాటపర్వం;సెమీస్ లో భారత్ 


          ఒత్తిడిలో విశ్వరూపం చూపించే విరాట్ కోహ్లి మరోమారు తన సూపర్ బ్యాటింగ్ తో ఇండియా ని సెమిస్ చేర్చాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 160పరుగులు చేసింది మొదట్లో ఖవాజ 16బంతుల్లో 26,ఫించ్ 34బంతుల్లో 43 పరుగులతో జోరుగా పరుగుల ప్రవాహం కొనసాగించగా ఆసిస్ 200స్కోర్ దాటేలా కనిపించినా పాండ్య 2/36,భూమ్ర 1/32,నెహ్రా 1/20 డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ తో ఆసీస్ ని కట్టడి చేసారు. 
           161పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో 49పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోహ్లి 51బంతుల్లో 82నాటౌట్ సూపర్ షో కి యువరాజ్ 21,ధోని 18నాటౌట్ అండగా నిలవడంతో భారత్ సూపర్ షో తో తొలుత కంగారుపడిన భారత్ చివరకు ఆసీస్ ని కంగారు పెట్టించి మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించాడు. ఆసీస్ బౌలర్లో వాట్సన్ 2/23,నైల్ 1/33రాణించారు. 82పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

మరోమారు చంద్రహాసం;జగన్ కు ఝంఝాటం

మరోమారు చంద్రహాసం;జగన్ కు ఝంఝాటం 

చంద్రబాబు ని ఇరుకున పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నా ఎట్టకేలకు మరోమారు చంద్రబాబు ఆకర్ష్ దరహాసం చేసాడు. వైసిపి ఎమ్మెల్యే పరువుల సుబ్బారావు పార్టీ వీడి టిడిపి లో చేరుతున్నట్లు ప్రకటించగా,మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కూడా పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. పిఏసి చైర్మెన్ పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న జ్యోతుల నెహ్రూ తో చెవిరెడ్డి మంతనాలు జరిపినా పలితం లేనట్టు తెలుస్తుంది,పార్టీ వీడటానికి సిద్దపడిన జ్యోతుల నెహ్రూ టిడిపి మంత్రులతో,టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ తో చర్చలు జరిపారు. ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో సమావేశమైన నెహ్రూ పార్టీ వీడుతున్నట్లు అనుచరులకు తెలిపాడు. జ్యోతులతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు 

తెలంగాణాలో రెండో రోజు సూర్య ప్రతాపంతో హైదరాబాద్ ,నిజామాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా వడదెబ్బ తో అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈరోజు హైదరాబాద్,నిజామాబాద్ లో 41,మెదక్ లో 40,వరంగల్ లో 39,కరీంనగర్,ఖమ్మం 38,మహబూబ్ నగర్ ,రంగారెడ్డి ,నల్గొండ లో 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులనుండి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో జనం విలవిలలాడుతున్నారు. 

చంద్రబాబుకు చుక్కలు...!ద్రవ్యవినిమయ బిల్లుపై విప్ జారీ చేస్తున్న వైసిపి

చంద్రబాబుకు చుక్కలు...!ద్రవ్యవినిమయ బిల్లుపై విప్ జారీ చేస్తున్న వైసిపి

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ని మరో మారు ఇరకాటంలో పడేస్తున్నాడు ప్రతిపక్ష నేత జగన్. పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేల పై వేటు పడేలా పగడ్బందీ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఈ నెల అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగే వోటింగ్ లో పాల్గొని ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసిపి విప్ జారీ చేసేందుకు సిద్దమైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు జగన్. ఆరోజు అసెంబ్లీకి హాజరు కాకపోయినా పార్టీ విప్ దిక్కరించినట్టే అని ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇదివరకు రెండు సార్లు అవిశ్వాసం తో ఇరుకున పెట్టాలని చూసిన ప్రభుత్వం పార్టీ మారిన వారిని కాపాడిన ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటే లక్ష్యంగా ముందుకు సాగుతూ చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. 

అపర భగీరథుడు సిద్దమవుతున్నాడు ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి

అపర భగీరథుడు సిద్దమవుతున్నాడు ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి

తెలంగాణా ముఖ్యమంత్రి అపర భగీరథుడు కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్  ,తెలంగాణా జలవిధానం పై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సిద్దమవుతున్నాడు. విపక్షాల విమర్శలకి చెక్ పెట్టేలా,తెలంగాణా ప్రజలు గర్వపడేలా తెలంగాణా లోని 119నియోజకవర్గాల తాగు,సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైన్,నీటి వనరులను సమర్ధవంతంగా ఎలా వాడుకోవాలో తెలిపేలా అసెంబ్లీలో ఈ నెల 31న కెసిఆర్ పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాడు. ప్రాణహిత-చేవెళ్ల,కాళేశ్వరం,తుమ్మిడిహెట్టి,చనఖా-కోరాట,మేడిగడ్డ మొదలగు ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇంతకుముందు ప్రభుత్వాల డిజైన్ ,ప్రస్తుతం రీడిజైన్ అనంతరం ప్రయోజనాలు ,ఏ ప్రాజెక్టు నుండి ఎన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందించాలి ,కోటి ఎకరాలకు సాగునీరు ఏ విధంగా అందబోతుంది సభలో సమగ్రంగా వివరించానున్నాడు. 

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో 

ఒకప్పుడు ఎన్డియే సారధి,తొమ్మిది రెండు టర్ములు వరసగా అఖండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహాల్లో దిట్ట,మామను గద్దె దించి సింహాసనం అధిష్టించిన నేర్పరి అలాంటి చంద్రబాబు రాష్ట్ర విబజన అనంతరం ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అధికారం చేతిలో ఉన్నా పొరుగు రాష్ట్రం ,సొంత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మధ్యలో నలిగిపోతున్నాడు. ఓ వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ,మరో వైపు జగన్ వ్యూహాల చక్రంలో ఇరుక్కుని సతమతమవుతున్నాడు.తెలంగాణా లో 15మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ టిఅరేస్ ఆకర్షణలో పడి ముగ్గురికి చేరుకుంది. ఇంకా తెరవెనుక సన్నాహకాలు,సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో భూస్థాపితమైన టిడిపి నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి,ఇక ఆంధ్రలో అమరావతి భూదందా,మంత్రుల తీరు,వైసిపి నుండి జంపింగులు జరుగుతున్నా అవసరమైన మెజారిటీ జంపిగులు లేకపోవడంతో జగన్ వ్యూహాలతో సతమతం ,రోజా విషయంలో కేంద్రం నుంచి క్లాస్,పూర్తిగా సమసిపోని ఓటుకు నోటు ఇలా ప్రతిది మెడకి చుట్టుకుంటూ ఉండటంతో చంద్రబాబు జగన్ చంద్రశేఖరుల వ్యూహాల మధ్య నలిగిపోతున్నాడు.