అపర భగీరథుడు సిద్దమవుతున్నాడు ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి
తెలంగాణా ముఖ్యమంత్రి అపర భగీరథుడు కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ ,తెలంగాణా జలవిధానం పై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సిద్దమవుతున్నాడు. విపక్షాల విమర్శలకి చెక్ పెట్టేలా,తెలంగాణా ప్రజలు గర్వపడేలా తెలంగాణా లోని 119నియోజకవర్గాల తాగు,సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైన్,నీటి వనరులను సమర్ధవంతంగా ఎలా వాడుకోవాలో తెలిపేలా అసెంబ్లీలో ఈ నెల 31న కెసిఆర్ పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాడు. ప్రాణహిత-చేవెళ్ల,కాళేశ్వరం,తుమ్మిడిహెట్టి,చనఖా-కోరాట,మేడిగడ్డ మొదలగు ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇంతకుముందు ప్రభుత్వాల డిజైన్ ,ప్రస్తుతం రీడిజైన్ అనంతరం ప్రయోజనాలు ,ఏ ప్రాజెక్టు నుండి ఎన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందించాలి ,కోటి ఎకరాలకు సాగునీరు ఏ విధంగా అందబోతుంది సభలో సమగ్రంగా వివరించానున్నాడు.
No comments:
Post a Comment