ADD

Saturday 13 February 2016

రెండో రోజు ఢిల్లీ లో కెసిఆర్ బిజీ;రాజనాథ్,సిజేఐ ఠాకూర్ తో బేటీ

రెండో రోజు ఢిల్లీ లో కెసిఆర్ బిజీ;రాజనాథ్,సిజేఐ ఠాకూర్ తో బేటీ 

ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో రెండోరోజు బిజీగా గడుపుతున్నారు. ఈరోజు హోం మంత్రి రాజనాథ్ సింగ్ తో బేటీ అయిన కెసిఆర్ విబజన సమస్యలపై చర్చించారు. హై కోర్టు విబజన పై చర్చించిన కెసిఆర్ హైదరాబాద్ లో శాంతిబద్రతల సంరక్షణకు అదనపు బలగాలు కేటాయించాలని కోరారు.అలాగే విబజన చట్టంలోని నియోజక వర్గాల పునర్విబజన పై చర్చించిన కెసిఆర్ హోం మంత్రి తో బేటీ అనంతరం సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి తో బేటీ అయి హై కోర్టు విబజన త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

తెరపైకి ఓటుకు నోటు:ఎమ్మెల్యే మాగంటి అరెస్టుకు రంగం సిద్దం??

తెరపైకి ఓటుకు నోటు:ఎమ్మెల్యే మాగంటి అరెస్టుకు రంగం సిద్దం??

టిడిపిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న టిఅర్ఎస్ ఇప్పుడు మరోమారు ఓటుకు నోటు కేసును మరలా తెరపైకి తెస్తుంది. ఈరోజు ఓటుకు నోటు కేసులో A4 నిందితుడుగా ఉన్న మత్తయ్యకు ఏసిబి నోటీసులు ఇవ్వగా తాజాగా టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ అరెస్టుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన డబ్బులు మాగంటి గోపీనాథ్ నుండి తీసుకోచారని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన ప్రాథమిక ఆదారాలు సేకరించిన ఏసిబి గోపీనాథ్ ని కస్టడీ లోకి తీసుకోనున్నారని సమాచారం. ఓటుకు నోటు కేసుకు సంబంధించి అనుబంద చార్జిషీట్ నమోదు చేయనున్నారు . 

చైనాలో పీకే రికార్డును తిరగరాయనున్న బాహుబలి

 చైనాలో పీకే రికార్డును తిరగరాయనున్న బాహుబలి 


ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి ఇప్పుడు చైనా లో పీకే రికార్డును తిరగరాయనుంది. ఇప్పటికే పలు దేశాలల్లో విడుదలైన బాహుబలి కి అంతర్జాతీయ వెర్షన్ తయారుచేస్తున్నారు దర్షకుడు రాజమౌలి,దీనికోసం హాలివుడ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నాడు. త్వరలో లాటిన్ అమెరికా,జర్మనీ,జపాన్ లతో పాటు చైనాలో ఈ-స్టార్ డిస్ట్రి బ్యూటార్ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మే నెలలో విడుదలకు సర్వం సిద్దం అయింది. ఇంతకుముందు చైనాలో 5000థియేటర్లలో విడుదలైన పీకే చిత్రం చైనాలో అత్యదిక థియేటర్లలో విడుదలైన విదేశీ చిత్రంగా రికార్డు సృష్టించగా ఇప్పుడు బాహుబలి 6000థియేటర్లలో విడుదలకు సిద్దమై పీకే రికార్డును తిరగరాయనుంది. విడుదలకుముందే సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి పై చైనాలోనూ ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని ఆసక్తి నెలకొంది. 

Friday 12 February 2016

చాణక్య చంద్రగుప్త 'చంద్రశేఖర చక్రవ్యూహం'

చాణక్య చంద్రగుప్త 'చంద్రశేఖర చక్రవ్యూహం'

చాణక్య చంద్రగుప్త సమాన చంద్రశేఖర చక్రవ్యూహం ఏంటి??ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఈ వ్యూహం గురించిన పూర్తి వివరాలకు ఎదురుచూస్తూ ఉండండి...... 

స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్

స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్ 

గత మూడు రోజులుగా నష్టాలతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్స్ ఈరోజు స్వల్పంగా కోలుకుని తెరుకున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 22986 పాయింట్ల వద్ద ,నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 6980 పాయింట్ల వద్ద ముగిసాయి. 

రివ్యూ:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ;ఇది దీర ప్రేమ గాథ

రివ్యూ:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ;ఇది దీర ప్రేమ గాథ 

సినిమా:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ

నటీనటులు :నాని ,మెహ్రీన్ ,సంపత్ రాజ్ ,మురళి శర్మ 

దర్శకుడు :హను రాఘవపూడి 

సంగీతం :విశాల్ చంద్రశేకర్ 

నిర్మాత : రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర

కథ :చిన్నప్పట్నుంచే మహాలక్ష్మి (మెహ్రీన్)ని ప్రాణంగా భావించే కృష్ణ, ఆమెతో ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ తప్ప ప్రపంచానికి ఆ ప్రేమ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో బతుకుతుంటాడు. ఇక ఇదిలా ఉంటే పగ, ప్రతీకారాలే తమ జీవిత ధ్యేయంగా బతికే అప్పిరెడ్డి, రాజన్నల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలు కృష్ణగాడి ప్రేమకథను తాకి అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.ఫ్యాక్షన్ గొడవలకు కృష్ణ ప్రేమకథకు సంబంధం ఏంటి? ఈ ఫ్యాక్షన్ గొడవలోకి మాఫియా డాన్ డేవిడ్ భాయ్ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? ఏసీపీ శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లల కిడ్నాప్ కథేంటి? ఆ పిల్లలను కాపాడేందుకు కృష్ణ ఏం చేశాడు? ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని కృష్ణ తన ప్రేమను దక్కించుకోగలిగాడా? ఇన్ని వర్గాల మధ్యన జరిగే గొడవలో అతడి ప్రయాణం ఏయే మలుపులు తిరిగిందీ అన్నదే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’

ప్లస్ పాయింట్స్ :కథ ,కథనం,ఒక లవ్‌స్టోరీని వీలైనంత కొత్తగా, కమర్షియల్ టచ్ ఇస్తూ చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కృష్ణ, మహాలక్ష్మిల మధ్యన వచ్చే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. ప్రేమకథలో ఇలాంటి ఒక కొత్త యాంగిల్‌ను పరిచయం చేయడంతో పాటు, అందులో ఉన్న ఫన్‌ను సరిగ్గా పండించారు. ఇక ఒక ఊర్లో రెండు కుటుంబాల మధ్యన జరిగే ఫ్యాక్షన్ గొడవలు, ఈ గొడవకు పిల్లల కిడ్నాప్, మాఫియా కనెక్షన్, దానిచుట్టూ తిరిగే ఓ ప్రేమకథ.. నాని నటన ,చిన్నపిల్లల నటన 


తీర్పు :ఇది అందరు చూడదగ్గ కృష్ణ గాడి వీర ధీర ప్రేమ గాథ 

రేటింగ్ :4/5


ప్రదాని తో కెసిఆర్ బేటీ

ప్రదాని తో కెసిఆర్ బేటీ 

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా ఈరోజు ప్రదాని మోడీ తో బేటీ అయ్యారు. ఈ బేటీ లో బాగంగా విబజన సమస్యల గురించి చర్చతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా,వచ్చే ఐదేండ్లలో 30571 కోట్ల ప్రత్యేక గ్రాంటు,ఎఫ్అర్ బిఎమ్ పరిది పెంపు,మిషన్ బగీరథ ప్రాజెక్ట్ నిర్వాహణకు 10000కోట్ల ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని కోరారు. అలాగే రాబోయే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై చర్చించారు. మోడీ తో బేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో బేటీ అయ్యారు. ఆయనతో బేటీలో రాబోయే 3ఏళ్లలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. 2020 నాటికి తెలంగాణాలో 5000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలిపారు ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. తెలంగాణకు మరిన్ని సౌర పార్కులు కేటాయించాలని కోరారు. ఇందుకు గోయల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది . 

టిటిడిపి చీలిక వర్గం లో మరొకరికి మంత్రి గా చాన్స్ ???

టిటిడిపి చీలిక వర్గం లో మరొకరికి మంత్రి గా చాన్స్ ???

టిటిడిపి నుండి టిఅర్ఎస్ లోకి వెళ్ళిన చీలిక వర్గంలో ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రిగా చోటు దక్కగా రాబోవు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మరొకరికి అవకాశం ఇవనున్నట్లు టిఅర్ఎస్ వర్గాల సమాచారం. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో ముగ్గురు లేదా నలుగురికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇవనున్నట్లు తెలుస్తుంది ఇందులో ఒక బెర్తు చీలిక వర్గానికి,ఒక మహిళను ,మరో స్థానం కెసిఆర్ మాట కి కట్టుబడిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఖమ్మం ,వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తుంది. 

స్పీకర్ కి ఎర్రబెల్లి లేఖ:టిటిడిపి పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి అనుమతి??

స్పీకర్ కి ఎర్రబెల్లి లేఖ:టిటిడిపి పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి అనుమతి??

తెలంగాణా శాసనసభలో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ మధుసూధనాచారి కి లేఖ రాసారు. టిడిపి నుండి టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అందరం కలిసి నిన్న అసెంబ్లీ కార్యాలయంలో సమావేశం అయ్యాం ఈ సమావేశంలో టిడిపి నుండి ఎన్నికైన 15మందిలో 10మంది ఏమ్మేల్యేలము టిఅర్ఎస్ లో చేరినందున మమ్మల్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్డ్ 4వ నిబందన ప్రకారం టిఅర్ఎస్ లో విలీనానికి అంగీకరించాలని పేర్కొన్నారు. ఈ లేఖలో టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తలసాని,ఎర్రబెల్లి,తీగల,మంచిరెడ్డి,కృష్ణారావు ,ప్రకాష్ గౌడ్,సాయన్న,వివేకానంద,చల్లా సంతకాలు చేసారు. దీంతో టిటిడిపి శాసనసభ పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి రంగం సిద్దమైంది. 

Thursday 11 February 2016

ఢిల్లీ టూర్ కి కెసిఆర్:రేపు ప్రదాని,కేంద్రమంత్రులతో బేటీ

ఢిల్లీ టూర్ కి కెసిఆర్:రేపు ప్రదాని,కేంద్రమంత్రులతో బేటీ 

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా రేపు ప్రదాని మోడి తో పాటు పలువురు కేంద్రమంత్రులతో బేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంకానున్న నేపద్యం లో కెసిఆర్ ఢిల్లీ టూర్ ప్రాదాన్యత సంతరించుకుంది. ప్రదానితో బెటీలో కెసిఆర్ విబజన చట్టం లోని హామీ లతో పాటు బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై చర్చించనున్నారు. ఇందులో బాగంగా ఆర్దిక మంత్రి జైట్లీ ,రైల్వే మంత్రులతో బేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి రాజనాథ్ తో బేటీ అయి విబజన సమస్యల గురించి చర్చించనున్నారు . 

రెండు రోజుల్లో టిఅర్ఎస్ లోకి మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు?వీరి వీరి గుమ్మడిపండు పార్టీ వీడేవారెవరు ???

రెండు రోజుల్లో టిఅర్ఎస్ లోకి మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు?వీరి వీరి గుమ్మడిపండు పార్టీ వీడేవారెవరు ???

ఏమి ఆట ??ఏమి ఆట ??క్షణ క్షణం ఉత్కంట పార్టీ వీడేవారెవరు ??పార్టీలో ఉండేవారేవారు ??టి టిడిపి ఎమ్మెల్యే లు ఎపి సిఎం చంద్రబాబు తో వీరి వీరి గుమ్మడిపండు అన్న ఆట ఆడుతున్నట్టుగా ఉంది. పార్టీ ని వీడుతున్న ఎమ్మెల్యేలు ఎవరో ??ఉండేదేవరో తెలియని తికమకతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చంద్రబాబు. టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరిపి గంట అవకముందే పార్టీ వీడిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నిర్ణయం తో షాక్ తిన్న చంద్రబాబు కి మరో షాక్ ఇవ్వనున్నారు. ఢిల్లీ నుండి కెసిఆర్ తెలంగాణా రాగానే మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యే లు టిఅర్ఎస్ లోకి చేరనున్నారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలలో మిగిలేదేవరో??వీడేదేవరో??ఈ రెండు రోజులు బాబు కి వీరి వీరి గుమ్మడి పండు ఆటే!


టిడిపి కి మరో షాక్....!కాసేపట్లో టిఅర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

టిడిపి కి మరో షాక్....!కాసేపట్లో టిఅర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 

టిడిపి నుండి టిఅర్ఎస్ లోకి వలసలు క్షణ క్షణానికి ఉత్కంట రేపుతున్నాయి. గంట క్రితం వరకు టిడిపి విస్తృత స్థాయి సమావేశం లో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ,కార్యకర్తలకు బరోసా కల్పించి సమావేశం ముగించామన్న భావన ముగియకముందే సమావేశంలో పాల్గొని మాట్లాడి ,పార్టీలో పరిస్థితి ఏకరవు పెట్టిన నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిఅర్ఎస్ పార్టీలో చేరటానికి సిద్దమై సామావేశం నుండి మీడియా కంటపడకుండా హరీష్ రావు,కేటిఅర్ లను కలుసుకుని టిఅర్ఎస్ కండువా కప్పుకుని టిడిపి కి ఊహించని షాక్ ఇచ్చాడు. రాజేందర్ రెడ్డి చేరికతో టిడిపి నుండి గెలిచి టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ల సంఖ్య 10కి చేరడంతో పార్టీ పిరాయింపులతో సంబంధం లేకుండా అసెంబ్లీ లో టిడిపి ని టిఅర్ఎస్ లో విలీనానికి రంగం సిద్దమైంది. 

Stock markets in bear grip so far

Stock markets in bear grip so far


Indian stock markets  fell more than 3 percent on Two day and headed for their biggest daily falls in nearly six months, hitting their lowest levels since May 2014, as fears of a slowdown in the global economy hit markets worldwide.
State Bank of India fell 2.6 percent after saying quarterly net profit fell nearly two-thirds, below estimates.India's broader Nifty was down 3.4 percent after earlier falling as much as 3.5 percent to below 7,000 points, its lowest level since Prime Minister Narendra Modi was elected in May 2014.BSE SENSEX ended at 22951 with 807 points loss,NIFTY ended at 6976 with 239 point loss.

అమర్ రహే జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప

అమర్ రహే జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప 

ఆరు రోజులపాటు మంచు చేరియలకింద చిక్కుకుని ప్రాణాలతో పోరాడి గత మూడు రోజులుగా ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్న జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప మృతి చెందాడు. దేశం మొత్తం హనుమంతప్ప కోలుకోవాలని చేసిన పూజలు పలించలేదు. హనుమంతప్ప మృతికి ఆర్మీ అధికారులు సైనిక లాంచనాలతో ఘనంగా నివాళులర్పించారు. హనుమంతప్ప మృతిపట్ల ప్రదాని మోడీ తో సహా దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. హనుమంతప్ప మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో స్వస్థలానికి చేర్చి సైనిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . 

కొలువుదీరిన గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం;మేయర్ గా రామ్మోహన్;డిప్యూటీ గా పసియుద్దీన్

కొలువుదీరిన గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం;మేయర్ గా రామ్మోహన్;డిప్యూటీ గా పసియుద్దీన్ 

గ్రేటర్ మున్సిపల్ కార్యవర్గం కొలువుదీరింది. ఈరోజు ఉదయం  కొత్తగా ఎన్నికైన మున్సిపల్  కార్పొరేటర్లు ,ఎక్ష్ అపీసియో సభ్యులు,మంత్రులసమావేశమైన అనంతరం కలెక్టర్  రాహుల్ బొజ్జ కార్పోరేటర్ల తో  ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. మేయర్ గా చెర్లపల్లి డివిజన్ నుండి ఎన్నికైన బొంతు రామ్మోహన్ ,డిప్యూటీ మేయర్ గా బొరబండ నుండి ఎన్నికైన బాబా పసియుద్దీన్ లను ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎంఐఎమ్ కార్పొరేటర్లు సైతం మద్దతు తెలపడం విశేషం . మేయర్,డిప్యూటీ మేయర్ లుగా తొలి నుండి టిఅర్ఎస్ కి పనిచేసిన యువనేతలకు దక్కడంతో  అందరూ హర్షం వ్యక్తం చేసారు . 

సైనిక వీరుడు హనుమంతప్ప క్షేమం కోసం దేశవ్యాప్త పూజలు

సైనిక వీరుడు హనుమంతప్ప క్షేమం కోసం దేశవ్యాప్త పూజలు 

ఆరురోజులపాటు సియాచిన్లో మంచు చరియలకింద కూరుకుపోయి కొన ప్రాణాలతో బయటపడి ఢిల్లీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనిక వీరుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప క్షేమం కోసం దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు . హనుమంతప్ప సంకల్పాన్ని కొనయాడిన సోనియాగాంధి,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం హనుమంతప్ప ప్రాణాపాయం నుండి బయటపడటం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. హనుమంతప్ప పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రెండు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ఉందని,48గంటలు పర్యవేక్షణలో ఉంటే గాని ఏమి చెప్పలేమని వైద్య బృందం తెలిపింది . 

భాగ్యనగరి సిగలో మరో ఐటి దిగ్గజం :ఆపిల్ ఇన్ హైదరాబాద్

భాగ్యనగరి సిగలో మరో ఐటి దిగ్గజం :ఆపిల్ ఇన్ హైదరాబాద్ 

ప్రపంచ ప్రఖ్యాత ఐటి దిగ్గజం ఆపిల్ తన ఇన్నోవేషన్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. యూరప్ సహా ఇతర దేశాలతో పాటు ఇండియా లోని అనేక నగరాల్లో పరిశీలన అనంతరం ఆపిల్ సంస్థ హైదరాబాద్ వైపు మొగ్గుచూపింది. గత కొన్ని రోజులుగా సంస్థ ఉన్నతస్థాయి వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ సంస్థ జూన్ నుంచి తొలుత తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంవత్సర చివరినాటికి మ్యాప్స్ విబాగాన్ని పూర్తి స్థాయిలో ప్రారంబించనుందని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు గచ్చి బౌలీ లోని తియన్మన్ స్పేయర్ ఐటి సెజ్ లో 2.5లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. ఈ సంస్థ గూగుల్ మ్యాప్స్ తరహాలో తమ ఫోన్లు ,మ్యకుల్లోను మ్యాప్స్ ఉండేలా మ్యాప్స్ సిద్దం చేయనుంది ఇందుకోసం తొలిసారి అమెరికా బయట తమ సాంకేతిక కేంద్రాన్ని ప్రారంబిస్తున్నారు. దీని కార్యకలాపాలు ప్రారంబం అయితే 4500 మందికి ఉద్యోగాలు లబించనున్నాయి. 

విద్యార్ధి నేత నుండి తొలి మేయర్:రామ్మోహన్ ప్రస్థానం

            విద్యార్ధి నేత నుండి తొలి మేయర్:రామ్మోహన్ ప్రస్థానం

వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ తొలుత ఏబివిపి కార్యకర్తగా పనిచేసి టిఅర్ఎస్ పార్టీ ఏర్పాటయ్యాక టిఅరేస్ విద్యార్థి విబాగం లో చేరి టిఅర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు ఉస్మానియాలో ఎల్ ఎల్ బి పూర్తి చేసిన రామ్మోహన్ ప్రస్తుతం ఉస్మానియాలో పి హెచ్ డి లో థీసిస్ సమర్పించాడు. తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామ్మోహన్ ఎన్నో సార్లు అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించాడు.ఈ క్రమంలో కెసిఆర్ కి నమ్మినబంటులా మారిన రామ్మోహన్ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో జగన్ వరంగల్ పర్యటన అడ్డుకుని తెలంగాణా డిమాండ్ ని జగన్ కి తెలిసేలా చేసాడు. ఉద్యమంలో బాగంగా ఇతనిపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి.2014ఎన్నికల్లో సనత్ నగర్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి కెసిఆర్ ఆదేశంతో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన రామ్మోహన్ గ్రేటర్ ఎన్నికల్లో చివరి నిమిషంలో కెసిఆర్ ఆదేశాలతో కార్పొరేటర్ గా పోటీ చేసి ఘన విజయం సాదించాడు. తెలంగాణా ఉద్యమంలో బాగంగా చాలారోజులు చర్లపల్లి జైల్లో జైలు జీవితం అనుభవించిన రామ్మోహన్ చర్లపల్లి డివిజన్ నుండి ఎన్నికై తెలంగాణా ఏర్పడ్డాక హైదరాబాద్ తొలి మేయర్ గా ఎన్నికయ్యాడు . 

Wednesday 10 February 2016

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 100 కోట్లు కేటాయింపు

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 100 కోట్లు కేటాయింపు 


కెసిఆర్ హామీ ఇచ్చినట్లు  వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ,ఈ అథారిటీకి 100కోట్లు కేటాయిస్తూ ఉత్తరువులు జారీ చేసారు . వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మెన్ గా కెసిఆర్ ,వైస్ చైర్మెన్ గా రిటైర్డ్ ఐఏఎస్ పురుషోత్తం రెడ్డి వ్యవహరించనున్నారు. అలాగే టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి 14మంది తాత్కాలిక సభ్యులను కేటాయిస్తూ ఉత్తరువులు జారీ చేసారు. 

గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ గౌడ్ ??

గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ గౌడ్ ??

గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా తొలుత కేకే కూతురు విజయలక్ష్మి పేరు వినిపించిన ప్రస్తుతం రేసులోకి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ గౌడ్ వచ్చినట్లు టిఅర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి ని కొందరు వ్యతిరేకించడంతో మొదటి నుంచి కెసిఆర్ కి నమ్మిన బంటు గా ఉన్న రామ్మోహన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక డిప్యుటీ మేయర్ రేసులో పీజేఆర్ కూతురు విజయా రెడ్డి ,సపియుద్దిన్ పేర్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణా లో టిడిపి అవుట్ ???టిఅర్ఎస్ లోకి ఎర్రబెల్లి,ప్రకాష్ గౌడ్

 తెలంగాణా లో టిడిపి అవుట్ ???టిఅర్ఎస్ లోకి ఎర్రబెల్లి,ప్రకాష్ గౌడ్ 


 తెలంగాణాలో టిడిపి భూస్థాపితం కానుంది. నిన్న వివేకానంద గౌడ్ టి.అర్.ఎస్ లో చేరి టిడిపి కి షాక్ ఇవ్వగా,ఈరోజు టిడిపికి డబల్ షాక్ తగిలింది.అసెంబ్లీ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టిడిపి ని వీడి టిఅర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొన్నిరోజులుగా టిడిపి ఎమ్మెల్యే లతో మంతనాలు కొనసాగిస్తున్న మంత్రి హరీష్ రావు ఈరోజు నారాయణఖేడ్ లో కెసిఆర్ ఉప ఎన్నికల ప్రచార సభ అనంతరం హరీష్ రావు ని కెసిఆర్ స్వయంగా తన హేలిక్యాప్టార్ లో హైదరాబాద్ తీసుకురాగా ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో చర్చల అనంతరం హరీష్ రావు తో కలసి వచ్చి కెసిఆర్ తో మాట్లాడి టిఅర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 2,3రోజుల్లో వరంగల్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో కెసిఆర్ పార్టీ కండువా కప్పనున్నారు,ఇదిలా ఉంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిఅర్ఎస్ లో చేరనున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించడం టిడిపి గుండెల్లో గునపాలు దిమ్పినట్లు చేసారు. ఇప్పటికే టిఅర్ఎస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే ల సఖ్య 9కి చేరడంతో మరో ఎమ్మెల్యే చేరితే పార్టీ పిరాయింపు చట్టం వర్తించకుండా అధికారికంగా టిడిపి ఎమ్మెల్యే లు టిఅర్ఎస్ లో విలీనం అయినట్లు అవుతుంది. 

The Indian stock market ended weak on Wednesday

The Indian stock market ended weak on Wednesday


Bse Sensex  ended weak on Wednesday, extending losses to a third consecutive day.The Sensex, which plunged to 23,636.72, ended the day at 23758.90 with a loss of 262.08 points or 1.09%. The Nifty50 closed down82.50 points or 1.13% at 7215.70, nearly 40 points off the day's low of 7177.75.

కేంద్రమంత్రిగా పవన్???;కాపు గొడవతో కేంద్రమంత్రి....!

 కేంద్రమంత్రిగా పవన్???;కాపు గొడవతో కేంద్రమంత్రి....!

ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ గొడవ ల పుణ్యమా పవన్ కి జాక్ పాట్ తగిలేలా ఉంది. ఇన్నిరోజులు తన కొడుకు లోకేష్ ను కేంద్రమంత్రిగా చేద్దామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్ల కుంపటి రగులు కోవడంతో ఇప్పుడు కాపుల మద్దతు తమ పార్టీకే ఉండాలని కేంద్ర మంత్రి పదవికి కాపు కోటాలో పవన్ పేరుని సూచించినట్టు బిజేపీ వర్గాలు అంటున్నాయి.ఇది వరకు గతంలో దాసరి అనూహ్యంగా కేంద్ర మంత్రి అవ్వగా ,పి.అర్.పి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి చిరు కేంద్ర మంత్రి అయ్యాడు,ఇప్పుడు ఆ అవకాశం పవన్ తలుపు తట్టింది. చంద్ర బాబు పవన్ పేరు సూచించడంతో 2014ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజేపీ కి చేసిన సేవలకు గుర్తుగా మోడీ సైతం సానుకూలంగా ఉండనున్నారు. ఈ విషయం పవన్ కి సన్నిహితుడుగా ఉండే బిజేపీ నేత పవన్ కి తెలియజేసి ఇస్తుంది బిజేపీ కనుక సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. పవన్ అంగీకరిస్తే రాబోయే మంత్రి వర్గ విస్తరణలో పవన్ కి చోటుదక్కడం ఖాయం అంటున్నారు. 

లేడీ ఎమ్మెల్యేకి లైనేసేపనిలో బన్నీ

లేడీ ఎమ్మెల్యేకి లైనేసేపనిలో బన్నీ 


ఓ లేడీ ఎమ్మెల్యే కి లైనేసేపనిలో  బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్....!బన్నీ ఏంటి?లేడీ ఎమ్మెల్యే కి లైనేయడమేంటి .. ?అనుకుంటున్నారా?బోయపాటి  డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఓ లేడీ ఎమ్మెల్యేకి లైన్ ఎస్తూ పనులుచక్కపెట్టుకునే ఓ సామాన్య కుర్రాడి కథగా బోయపాటి చెప్పిన లైన్ కి పిదా అయిన అల్లు అరవింద్,అర్జున్ ఈ కథను ఓకే చేయగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. బోయపాటి మార్క్ మాస్ ,ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో  రకుల్ ప్రీత్ సింగ్ ,కథెరీన తెరిస్సా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది . 

హరీష్ కి సమాచార శాఖ ???;కీలక శాఖలను వదులుకుంటున్న సి.ఎం

హరీష్ కి సమాచార శాఖ ???;కీలక శాఖలను వదులుకుంటున్న సి.ఎం 


మొన్న పురపాలక... నిన్న ఎస్సీ,సహకార అభివృద్ధి శాఖా ... రేపు సమాచార ?? ఇలా కెసిఆర్ తనవద్ద ఉన్న కీలక శాఖలను మంత్రులకు కేటాయిస్తున్నారు . సమయాబావం వల్ల ఈ శాఖలపై ద్రుష్టి కేంద్రీకరిన్చలేకపోవడం వల్ల ఫైళ్ళు పెండింగ్ పడుతుండటంతో కెసిఆర్ ఒక్కొక్క శాఖను మంత్రులకు అదనపు బాద్యతలుగా అప్పగిస్థున్నరు. మొన్న కేటిఅర్ కి కీలకమైన పట్టనాభివ్రుద్ది ,పురపాలక శాఖను అప్పగించగా ,నిన్న ఎస్సీ అభివృద్ధి శాఖ,సహకార శాఖను మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అప్పగిస్తూ సి.ఎస్ రాజీవ్ శర్మ ఉత్తరువులు జారీ చేసారు. ఇక సి.ఎం వద్ద ఉన్న సమాచార శాఖను మంత్రి హరీష్ రావు కి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. 

సుందర్ పిచాయ్ కి బంపర్ బొనాంజా...!

సుందర్ పిచాయ్ కి బంపర్ బొనాంజా...!

గతేడాది గూగుల్ సి.ఇ.ఒ గా బాద్యతలు చేపట్టిన భారతీయుడు సుందర్ పిచయ్ కి గూగుల్ మాతృ సంస్థ అల్పాబేట్ 19.9 కోట్ల డాలర్లు (దాదాపు 1334కోట్ల రూపాయల )విలువైన 2.73లక్షల కంపెనీ షేర్లని కేటాయించింది. దీంతో అమెరికాలో అత్యదిక వేతనం అందుకుంటున్న సిఇఒ గా సుందర్ నిలిచాడు. తాజా కేటాయింపులతో అల్పాబేట్ లో సుందర్ హోల్డింగ్స్ 65కోట్ల డాలర్లకు చేరుకున్నాయి . 

పసిడి పరుగులు@ 28000

పసిడి పరుగులు@ 28000

ఇండియన్ స్టాక్ మార్కెట్ లు నష్టాలు చవిచూస్తున్డటం ఈక్విటీ షేర్లు పతనాల్లో ఉండటం తో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టుటకు మొగ్గుచూపుతున్డటం తో  పుత్తడి పరుగులు పెడుతుంది. నిన్న ఒక్కరోజే బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం దర రూ. 710 పెరిగి రూ. 28585 కి చేరుకుంది. ఒక్కరోజులో 710 పెరగడం ఈ ఏడాది లోనే అతిపెద్ద పెరుగుదలతో బంగారం ధర 12నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే వెండి కిలోకి రూ. 1180 పెరిగి రూ . 37230 కి చేరుకుంది. ప్రపంచ ఆర్దిక వ్యవస్థ వ్రుద్దిపై ఆందోళన పెరుగుతుండటం తో  ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను విలువైన లోహాలపైకి మళ్ళించడం వల్లే ఇంతగా పసిడి ధర పెరగడానికి కారణం అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

వాల్ మార్ట్ ప్రతినిదులతో కేటిఅర్ బేటీ: త్వరలో కీలక ఎంవోయూలు??

వాల్ మార్ట్ ప్రతినిదులతో కేటిఅర్ బేటీ: త్వరలో కీలక ఎంవోయూలు??

తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు సాదించడానికి కేటిఅర్ కీలక బేటీ ల పరంపర కొనసాగుతుంది. మొన్న దేశీ కార్పోరేట్ దిగ్గజాలైన టాటా ,రిలయన్స్ అధినేతలతో బేటీ అయిన కేటిఅర్ నిన్న ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు ఎన్రిక్ ఒస్లే తో బేటీ అయిన కేటిఅర్ తెలంగాణాలో మహిళల కోసం వాల్ మార్ట్ తో కలసి కిరాణా దుకాణాలు ఏర్పాటు,కృషి మార్ట్ లు,కూరగాయల సరపరాపై చర్చించారు. ఇందుకు అంగీకరించిన వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు త్వరలోనే ఎం. వో.యూ లు చేసుకున్నారు. రిటైల్ రంగంతో పాటు వైద్య ,నైపుణ్య శిక్షణ రంగంలో కూడా తెలంగాణాలో వాల్ మార్ట్ సేవలు అందిస్తామని ఎన్రిక్ తెలిపారు. ఎన్రిక్ తో బేటీ అనంతరం నార్వే రాయబారి నీల్స్ రాగ్నర్ కామ్ తో బేటీ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల ఫండ్ కలిగిన నార్వే తెలంగాణా లో పెట్టుబడులకు సిద్దంగా ఉందని,మర్చి లో ఢిల్లీ లో జరిగే నార్వే సంస్థల బేటీ లో పాల్గొనవల్సిందిగా కేటిఅర్ కి ఆహ్వానించారు 

Tuesday 9 February 2016

కుర్రాళ్లు కొట్టారు .... పెద్దోళ్లు పడ్డారు....

కుర్రాళ్లు కొట్టారు .... పెద్దోళ్లు పడ్డారు.... 

అండర్ -19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ళు లంకను దాటి ఫైనల్లో అడుగుపెడితే పూణే ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగిన టి-20 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ రజిత 3/29 సూపర్ బౌలింగ్ తో రోహిత్ 0 పరుగులకే వెనుదిరగగా రహనే 4 పరుగులు చేసి ఔట్ అవడంతో బారత పతనాన్ని ప్రారంబించగా సనక 3/16 విజ్రుమ్బించడం తో బారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆల్ ఔట్ అయింది.ఓ దశలో వంద పరుగులలోపే అల్ ఔట్ అయ్యేలా కనిపించిన భారత్ అశ్విన్ 31 పరుగులతో ఆదుకున్నాడు. 
102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన లంక ను తొలుత నెహ్రా ,బుమ్రా కట్టడి చేసినా చందిమల్ 57  బంతుల్లో 35,కపుగెదెర 25 పరుగుల సమయోచిత బ్యాటింగ్ తో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి విజయం సాదించింది . బారత బౌలర్లలో నెహ్రా 2,అశ్విన్ 2,రైనా 1వికెట్ తీసారు. 3/29 తో అదరగొట్టిన రజత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు . 

కొత్త కలల సౌధం కట్టబోతున్న కెసిఆర్....!

కొత్త కలల సౌధం కట్టబోతున్న కెసిఆర్....!

ప్రస్తుతం కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ లో ఏదైనా సమావేశం జరపాలన్న,సి.ఎం ని కలవడానికి వస్తున్న జనం తో ఇరుకుగా ఉండటంతో ఓ కొత్త విశాల భవనాన్ని నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నారు.త్వరలో నిర్మించబోతున్న ఈ భవనాన్ని 30 కోట్ల ఖర్చుతో 3000 మందితో సమావేశం జరుపుకునేంత వీలు,300 కార్లు పార్క్ చేసుకునేంత సామర్ద్యంతో 6 నెలల స్వల్ప కాల వ్యవదిలో ఈ సౌధాన్ని ఆహ్లాదవంతంగా,హరితవనంగా నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ సౌధం నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి నిర్మాణానికి ప్లాన్ సిద్దం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది . 

BSE Sensex 266 points down

BSE Sensex 266 points down


BSE Sensex ended sharply lower on Tuesday, extending its losses to a second successive day, as a sell-off in Japan and uncertainty about economic reforms in Greece hurt sentiment and prompted investors to indulge in some heavy selling.
Indian stock markets  ended down 266.44 points or 1.1% at 24,020.98, after plunging to a low of 23,919.47. The Nifty50 of the National Stock Exchange closed at 7298.20, losing 89.05 points or 1.21%, after declining to a low of 7275.15. Both Sensex and the Nifty hit their lowest levels since 21 January 2016.

లంకను దాటినా బారత్ ;అండర్-19 ఫైనల్లో భారత కుర్రాళ్లు

లంకను దాటినా బారత్ ;అండర్-19 ఫైనల్లో భారత కుర్రాళ్లు 


భారత అండర్-19 కుర్రాళ్లు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించారు. శ్రీలంక  తో జరిగిన సెమీఫైనల్లో 97 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది .డాఖ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అన్మోల్ ప్రీత్ సింగ్ 122బంతుల్లో 72పరుగులు ,సర్పరాజ్ ఖాన్ 65 బంతుల్లో 59పరుగులు తో అర్ద సెంచరీ లతో ఆదరగోట్టడంతో 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 268 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన లంక డాగర్ 3/21,ఆవేశ్ ఖాన్ 2/41 పదునైన బౌలింగ్ తో 42. 4ఓవర్లలో 170 పరుగులకే ఆల్ ఔట్ అయింది. 72 పరుగులతో బారత బ్యాటింగ్ కి వెన్నుముకగా నిలిచిన అన్మోల్ మ్యాన్ అప్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు . 

కారెక్కిన యువ ఎమ్మెల్యే వివేక్ :మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ???

 కారెక్కిన యువ ఎమ్మెల్యే వివేక్ :మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ???

గ్రేటర్ ఎన్నికలపలితాల్లో ప్రతిపక్ష పార్ట్ లకు తీవ్ర ఎదురుదెబ్బ తగలడం తో ప్రతిపక్ష నేతలు  టి.అర్.ఎస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. గ్రేటర్ పరిదిలోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ టి.అర్.ఎస్ లో చేరి టి.డి.పి కి పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యే లు కూడా టి.అర్.ఎస్ లో చేరడానికి రంగం సిద్దమైందని టి.అర్.ఎస్ వర్గాల సమాచారం ,టి.అర్.ఎస్ లో చేరబోయే ఇద్దరు ఎం.ఎల్.ఎ లు ఎవరు ?ఏ పార్టీ కి చెందిన వారో ఇంకా గోప్యంగానే ఉంది . నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికల బహిరంగ సభ లో కెసిఆర్ సమక్షంలో టి.అర్.ఎస్ లో చేరబోతున్నట్లు సమాచారం 

పరిశ్రమల శాఖ పట్టంతో కెటిఅర్ కి డబల్ ప్రమోషన్ ???

 పరిశ్రమల శాఖ పట్టంతో కెటిఅర్ కి డబల్ ప్రమోషన్ ???

రెండు రోజుల క్రితం కేటిఅర్ కి పురపాలక ,పట్టనాభివ్రుద్ది శాఖ తో ప్రమోషన్ ఇచ్చిన కెసిఆర్ త్వరలో కేటిఅర్ కి డబల్ ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ ను కె.టి.అర్ కి అప్పగించి కెటిఆర్ వద్దనున్న పంచాయితి రాజ్ శాఖ జూపల్లికి కేటాయించనున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే ఐటి శాఖ నిర్వహిస్తున్న కేటిఅర్ కి పరిశ్రమల శాఖా కేటాయించడంతో కేటిఅర్ తన వాక్చాతుర్యం ,తన గత కార్పోరేట్ అనుభవాలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురాగాలడని కెసిఆర్ భావిస్తున్నారు. పరిశ్రమల శాఖ ,పురపాలక,పట్టనాభివ్రుద్ది ఈ మూడు శాఖలు పట్టణాలకే పరిమితం కావడంతో సరైన సమన్వయంతో మున్దుకెల్లగలరని కెసిఆర్ అభిప్రాయం. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తరువులు రానున్నట్లు సమాచారం,అయితే ఇప్పటికే పెట్టుబడుల వేటలో గతంలో అమెరికా పర్యటనలో విజయం సాదించిన కేటిఅర్ నిన్న ముంబై పర్యటనలో టాటా గ్రూప్ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ,రిలయన్స్ గ్రూప్స్ చైర్మెన్ ముఖేష్ అంబానీ తో సమావేశం అయి తెలంగాణా ప్రభుత్వ కార్యక్రమాలతో బాగస్వాములుగా అవడానికి ఒప్పుకున్నట్లు కేటిఅర్ వెల్లడించారు . 

Monday 8 February 2016

150 కోట్ల రికార్డ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్ '

150 కోట్ల రికార్డ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్ '
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తరువాత మరోమారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాత్రని రిపీట్ చేస్తూ రతన్పూర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ గా హంగామా సృష్టించ నున్నారు. శరత్ మరార్ నిర్మాణ సారద్యంలో బాబీ దర్శకత్వం లో పవన్ పక్కన  కాజల్ ,లక్ష్మి రాయ్ ,సంజనలు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే 150కోట్ల బిజినెస్ చేస్తుంది . ఈ చిత్ర రైట్స్ ని నైజామ్ మినహాయించి వరల్డ్ వైడ్ గా 100కోట్లకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకున్ది. ఇక నైజాం రైట్స్ 20కోట్లకి ఇంద్ర ఫిల్మ్స్ వారు దక్కిన్చుకున్నట్లు తెలుస్తుంది . ఇంకా ఆడియో ,సాటిలైత్స్ హాక్కులతో కలిపి 150కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తుంది . వేసవి కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో . 

టాటా గ్రూప్ చైర్మెన్ మిస్త్రీ తో కేటిఅర్ బేటీ

టాటా గ్రూప్ చైర్మెన్ మిస్త్రీ తో  కేటిఅర్ బేటీ 
గత నెలరోజులుగా ఎన్నికల ప్రచార బాద్యతలతో గడిపిన కె.టి.అర్ ఇప్పుడు పెట్టుబడుల వేటలో పడ్డాడు . తెలంగాణా ఐ టి ,పంచాయితి శాఖ మాత్యులు కె.టి.అర్ ఈరోజు ముంబై పర్యటనలో ఉన్నారు. ఇందులో బాగంగా తొలుత టాటా గ్రూప్ చైర్మెన్ సైరస్ మిస్త్రీ తో బేటీ అయ్యారు. ఈ బేటీ లో కె,టి.అర్ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ,టి హబ్ ,టి.ఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాల పై ప్రజెంటేషన్ ఇస్తూ తెలంగాణా లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు తెలుస్తుంది ,ఇప్పటికే టాటా గ్రూప్ సంస్థలు ఆదిబట్లలోని ఏరోస్పేస్ హబ్ లో పెట్టుబడులు పెట్టగా రానున్నరోజుల్లో దిపేన్స్ ,ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్థున్ది. అలాగే టాటా స్పేస్ ఎ.ఐ.జీ టెక్నాలజీ సెంటర్ ను హైదరాబాద్ లో పెట్టడంతో పాటు టాటా క్యాపిటల్ లో బాగంగా టి హబ్ కి ఆర్దికసహకారం అందించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది . తెలంగాణా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాగస్వాములు అవుతామని కె.టి.అర్ తో బేటీ లో మిస్త్రీ పేర్కొన్నట్లు సమాచారం . 

టార్గెట్ 20/24;2019:ఈ బడ్జెట్ లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు 5వెల కోట్లు

టార్గెట్  20/24;2019:ఈ బడ్జెట్  లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు 5వెల కోట్లు 
గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీ పై ప్రభుత్వం ముసాయిదా సిద్దం చేస్తుంది.ఈ బడ్జెట్ లో గ్రేటర్ పరిదిలో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి సుమారుగా 3 వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి ప్రతిపాదనను సిద్దం చేయాల్సిందిగా అధికారులను కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది.గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పలు కాలనీల ప్రజలను బస్సుల్లో తెలంగాణా ప్రభుత్వం సికింద్రాబాద్ లోని ఐ.డి.హెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్ళను చూపడం ఓటర్లకు టి.అర్.ఎస్ పై సానుకూల దృక్పథాన్ని పెంచింది.దీంతో జి.హెచ్.ఎం.సి పరిదిలోని 24 నియోజకవర్గాల పరిదిలో ఐ.డి.హెచ్. కాలనీ తరహాలో లక్ష బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను యుద్ద ప్రాతిపాదికన నిర్మించి అర్హుల వివరాలు సేకరించి 2019 ఎన్నికల్లో జి.హెచ్.ఎం.సి పరిదిలోని 24 నియోజకవర్గాల పరిదిలో సుమారు 20 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యం గా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే మిషన్ బగీరథ లో బాగంగా నగర శివార్లకు యుద్దప్రతిపాదికన గోదావరి జలాలను తరలించడం జరిగింది.2019 వరకు ఇంటింటికి తాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది.అదేవిధంగా మంత్రులందరూ హైదరాబాద్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని,హైదరాబాద్ పరిదిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సైతం విధిగా హాజరుకావాలని కెసిఆర్ సూచించినట్లు తెలుస్తుంది.దీర్ఘకాలిక వ్యూహాలు పన్నడంలో చాణఖ్య చంద్రగుప్తుడుగా పేరుగాంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ 2019 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టి.అర్.ఎస్ వర్గాల సమాచారం. 

నివురుగప్పిన నిప్పుల నారాయణఖేడ్ ఉపఎన్నిక:అందరిచూపు హరీష్ పైనే


గత నెల రోజులుగా తెలంగాణా ప్రజల చూపంత గ్రేటర్ ఎన్నికలపలితాలవైపు చూసిన,గ్రేటర్ ఎన్నికలతో పాటు నివురుగప్పిన నిప్పుల నారాయణఖేడ్ ఉపఎన్నిక ఉంటూనే ఉంది,దీనికి కారణం బల్దియ ఎన్నికల సారద్యం వహించిన కె.టి.అర్,నారాయణఖేడ్ బాద్యతలు చూస్తున్న హరీష్ రావు లు టి.అర్.ఎస్ పార్టీ కి రెండు కన్నులల ఉండటం.ఇటు కె.టి.అర్ తన బాద్యతలు విజయవంతంగా నిర్వహించి పార్టీ కి ఘన విజయం సాదిన్చిపెట్టడంతో ఇప్పుడు అందరి చూపు నారాయణఖేడ్ పై,ఈ ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తున్న హరీష్ పై  పడింది.ఇప్పుడు హరీష్ రావు దృష్టి అంత నారాయణ్ఖేడ్ లో టి.అర్.ఎస్ కి బారి మెజారిటీ సాదించి ప్రత్యర్థి పార్టీ డిపాజిట్లు గల్లంతు చేయడమే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయిన ఇప్పుడు హరీష్ కి సవాల్ గా మారింది,ఇటు బల్దియ ఎన్నికల్లో బోర్లా పడ్డ ప్రతిపక్షాలు ఎలాగైనా కసి తీర్చుకోవాలని పట్టు చూపిస్తే ఈ వారం రోజులు మరో మినీ మహాసంగ్రామం గా నారాయణఖేడ్ ఉపఎన్నిక మారనుంది.కాంగ్రెస్ తరుపున దివంగత సిట్టింగ్ ఎం,ఎల్,ఎ కిష్టారెడ్డి తనయుడు సంజీవ రెడ్డి,టి.అర్.ఎస్ తరుపున భూపాల్ రెడ్డి బరిలో ఉన్న ఈ మినీ మహాసంగ్రామం లో అభ్యర్థులు నామమాత్రమే అయిపోయారు.గత నెలరోజులు నివురుగప్పిన నిప్పుల ఉన్న నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఈ వారం రోజులు మహాసంగ్రామాన్ని తలపిస్తుందేమో...వేచి చూడాల్సిందే  

Sunday 7 February 2016

కె.టి.అర్ కి పురపాలక,పట్టనాభివ్రుద్ది శాఖ కేటాయిస్తు జీవో జారీ:

కె.టి.అర్ కి పురపాలక,పట్టనాభివ్రుద్ది శాఖ కేటాయిస్తు జీవో  జారీ
బల్దియా ఎన్నికల్లో పట్టణంలోని ప్రతి డివిజన్లో తిరుగుతూ డివిజన్ లోని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న కె.టి.అర్ కి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలో చెప్పినట్టు పురపాలక,పట్టనాభివ్రుద్ది శాఖను కేటాయిస్తూ జీవో జారీ చేసారు.ఇప్పటికే ఐ.టి.,పంచాయితీరాజ్ శాఖలను సమర్దవంతంగా నిర్వహిస్తూ తెలంగాణా ప్రగతి బాటలో నడుచుటకు తనవంతు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కె.టి.అర్ ప్రస్తుతం చేపట్టబోయే బాధ్యతల్లో విజయవంతమై హైదరాబాద్ విశ్వనగరంగా మరో మెట్టు ఎదగటం లో ముందుంటాడని ఆశిస్తూ కె.టి.అర్ గారికి అల్ ది బెస్ట్...

గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి ???

                                             గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి ???
 బల్దియా ఎన్నికల్లో  విజయదుందుభి మోగించిన టి.అర్.ఎస్ పార్టీ మేయర్  ఎన్నికపై  దృష్టి  పెట్టింది . మేయర్  బి.సి  జనరల్  కి  రిజర్వ్ కావడంతో  ముఖ్యమంత్రి  కెసిఆర్  మేయర్  గా  కె.కె  కూతురు జుబ్లిహిల్ల్స్ నుండి  గెలుపొందిన విజయలక్ష్మి ,టి.అర్.ఎస్.వి  లో కీలక పాత్ర  పోషించి  కార్పొరేటర్ గా  ఎన్నికయిన బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలించగా ,ఇప్పటికే  కెసిఆర్  మంత్రివర్గంలో  మహిళలకు  ప్రాతినిద్యం లేనందున గ్రేటర్ మేయర్ గా  విజయలక్ష్మి వైపు మొగ్గుచూపినట్లు  సమాచారం . ఇక  డిప్యూటీ  మేయర్  గా  రామ్మోహన్  తో  పాటు  పలువురిపేర్లు పరిశీలిస్తునట్లు తెలుస్తుంది .