ADD

Friday 12 February 2016

స్పీకర్ కి ఎర్రబెల్లి లేఖ:టిటిడిపి పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి అనుమతి??

స్పీకర్ కి ఎర్రబెల్లి లేఖ:టిటిడిపి పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి అనుమతి??

తెలంగాణా శాసనసభలో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ మధుసూధనాచారి కి లేఖ రాసారు. టిడిపి నుండి టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అందరం కలిసి నిన్న అసెంబ్లీ కార్యాలయంలో సమావేశం అయ్యాం ఈ సమావేశంలో టిడిపి నుండి ఎన్నికైన 15మందిలో 10మంది ఏమ్మేల్యేలము టిఅర్ఎస్ లో చేరినందున మమ్మల్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్డ్ 4వ నిబందన ప్రకారం టిఅర్ఎస్ లో విలీనానికి అంగీకరించాలని పేర్కొన్నారు. ఈ లేఖలో టిఅర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తలసాని,ఎర్రబెల్లి,తీగల,మంచిరెడ్డి,కృష్ణారావు ,ప్రకాష్ గౌడ్,సాయన్న,వివేకానంద,చల్లా సంతకాలు చేసారు. దీంతో టిటిడిపి శాసనసభ పక్షాన్ని టిఅర్ఎస్ లో విలీనానికి రంగం సిద్దమైంది. 

No comments:

Post a Comment