ADD

Tuesday 29 March 2016

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు 

2014ఎన్నికల ముందు కేంద్రంలో మోడీ గాలి వీస్తుంటే తెలంగాణాలో కెసిఆర్ నామస్మరణ జరుగుతుంది అలాంటి సమయంలోనే ఆంధ్రలో మాత్రం జగన్ హవా అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితి మారాలంటే ఎలాగైనా మోడీ తో దోస్తీ తప్పనిసరి అని బిజేపీ రాష్ట్ర నాయకత్వం వద్దంటున్న చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడి ప్రయత్నం ,వెంకయ్య నాయిడి మధ్యవర్తిత్వం,చంద్రబాబు చతురతతో టిడిపి,బిజేపీ పొత్తు కుదిరింది వీరిరువురికి తోడు పవన్ జతకలవడంతో ఆంధ్రలో అధికార పీఠం ఎక్కారు చంద్రబాబు,ఈ పొత్తుతో బీజేపీకి ఒరిగేదేమీ లేకపోయినా పొత్తుల మిత్రదర్మం తో టిడిపికి కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చారు మోడీ ,ఆంధ్ర కి ఇచ్చిన హామీ ప్రకారం ఐఐటి,ఐఐఎమ్,ఐఐఐటి,ఐఐఎస్టి లాంటి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు కుమ్మరించింది. మరెన్నో అభివ్రుద్ది నిధులను కేటాయించింది,కానీ చంద్రబాబు ఆడంబరాలు ,పబ్లిసిటీ స్టంట్స్,బాబు అండ్ కో అవినీతి తో నిధుల దుర్వినియోగం గ్రహించిన కేంద్ర సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ విషయం పక్కన పెట్టింది. స్వయంగా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతో తను కేంద్రం చేతిలో చిక్కాడు ఇదిలా ఉండగా మధ్యలోకి చంద్రశేఖర్ రావు ప్రవేశించాడు. కేంద్రానికి ఇప్పటికిప్పుడు కెసిఆర్ అవసరం లేకపోయినా బావిష్యత్తులో కచ్చితంగా అవసరం అవుతుంది. తెలంగాణా లో సంక్షేమ కార్యక్రమాలతో తిరుగులేని ప్రజాదారనతో ముందుకేల్తుంటే చంద్రబాబు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. అందుకే కేంద్రం చంద్రబాబుని పొమ్మనలేక పోగాబెట్టలేక సహాయనిరాకరణ చేస్తూ చంద్రశేఖరునికి దగ్గరవుతూ ఆహ్వాన మాటల మంత్రాంగాలు కొనసాగిస్తూ ఉంది. 

No comments:

Post a Comment