ADD

Wednesday 30 March 2016

ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం

       ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం 


తెలంగాణా పారిశ్రామిక విధానం టిఎస్-ఐపాస్ తో ఎనిమిది నెలల సమయంలోనే ప్రపంచం ద్రుష్టి తెలంగాణా వైపు తిప్పి 30000కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించిన తెలంగాణా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రపంచ అత్యుత్తమ ఐటీ విధానం ఏప్రిల్ 4న ఐటీ దిగ్గజాల నడుమ ప్రపంచానికి ప్రకటించనుంది.ప్రపంచ ఐటీ కేంద్రంగా తెలంగాణాను నిలపాలనే దృడ నిశ్చయంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విజ్ఞప్తి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా విస్తరించి ఉన్న ఐటీ రంగాన్ని తెలంగాణాలోని కరీంనగర్,వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలి,హైదరాబాద్ లో నిర్మించిన అంకుర కేంద్రం 'టి-హబ్' రెండో కేంద్రాన్ని హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలి. నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ లో ఐటీ పరిశ్రమల విస్తరణకు రాయితీలు,మౌలిక వసతులను,పెట్టుబడి రాయితీలు కల్పించాలి.ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా వంటి స్వదేశీ ఐటీ దిగ్గజాలతో, బిపీవో కాల్ సెంటర్లు,ఎంఎన్సీ లతో తెలంగాణా లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ డ్రైవ్ లు నిర్వహించాలని,ఐటి పాలసీలో తెలంగాణా ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుతూ తెలంగాణా పునర్నిర్మాణానికి  అంకుటిత దీక్షతో ముందుకేల్తున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మీ శ్రేయోభిలాషులు.        
---వేముల కర్ణాకర్ రెడ్డి (తీగెల ధర్మారం,ధర్మపురి,కరీంనగర్)

No comments:

Post a Comment