ADD

Tuesday 5 April 2016

పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ'

పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ' 

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణా నిన్న ప్రపంచ అత్యుత్తమ ఐటి పాలసీ ని అతిరథుల సమక్షంలో నిన్న ఆవిష్కరించారు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు వి.కె సారస్వత్,ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి,ముఖ్యమంత్రి కెసిఆర్,డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి,మంత్రులు నాయిని,తారకరామారావు,తెలంగాణా ప్రభుత్వ అధికారులు పాల్గొనగా తెలంగాణా ఐటి పాలసీ లో బాగంగా మరో నాలుగు సబ్ పాలసీలను ఆవిష్కరించారు.తెలంగాణా ఐటీ పాలసీ తో పాటు తెలంగాణా ఇన్నోవేషన్ పాలసీ ,రూరల్ టెక్ పాలసీ,ఎలక్ట్రానిక్ పాలసీ,ఇమేజ్ అండ్ గేమింగ్ పాలసీలను ఆవిష్కరించారు. తెలంగాణా ఐటీ పాలసీ పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉందని కార్యక్రమానికి హాజరైన ఐటీ నిపుణులు పేర్కొన్నారు.  ఇందులో బాగంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం చిత్తసుద్దితో పనిచేస్తుందని,ప్రపంచ అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో 8నెలల కాలంలోనే 1691కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని,అన్నివిధాల తెలంగాణా ఐటి పెట్టుబడులకు అనుకూలం అని కెసిఆర్ పేర్కొనగా,నారాయణ మూర్తి దేశం లోని ప్రతి పట్టణం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలతో పోటీ పడాలని,ప్రతి నిర్ణయం పారదర్శకంగా,వేగంగా,ఓపెన్ మైండ్ తో ఉండాలని సూచించారు. 

No comments:

Post a Comment