ADD

Monday 15 February 2016

కేంద్ర క్యాబినెట్ లోకి టిఅర్ఎస్???ఒక మంత్రి,రెండు సహాయ మంత్రులు???

కేంద్ర క్యాబినెట్ లోకి టిఅర్ఎస్???ఒక మంత్రి,రెండు సహాయ మంత్రులు???


రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంతో దోస్తీకి సై అంటున్నారు. గత 3రోజుల పర్యటనలో కెసిఆర్ మోడీ సహా కేంద్ర కీలక మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రదాని మోడీ తో కీలక బేటీ లో ఎన్డియే ప్రభుత్వం లో టిఅర్ఎస్ చేరడానికి కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇందుకు ప్రతిపలంగా కేంద్ర క్యాబినెట్ లో ఒక మంత్రి,2సహాయ మంత్రులు అడగగా రాబోయే విస్తరణలో ఒక మంత్రి,ఒక సహాయ మంత్రి ఇయ్యడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ బడ్జెట్ లో తెలంగాణా కి సంబందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయహోద ,మిషన్ బగీరథ వంటి వాటికి కీలక ఆర్ధిక సహాయం అందించాలని కెసిఆర్ అడిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టిఅర్ఎస్ ఎంపి లుగా ఉన్నవారిలో కేకే,జితేందర్ రెడ్డి,వినోద్ కుమార్ లు మంత్రి గా అవకాశం కోసం చూస్తుండగా,ఒక సహాయ మంత్రిగా కవిత కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రం క్యాబినెట్ లో టిఅర్ఎస్ చేరగానే రాష్ట్రంలో ఇద్దరు బిజేపీ ఎమ్మెల్యే లకు మంత్రులుగా అవకాశం ఇవనున్నట్లు తెలుస్తుంది. 

No comments:

Post a Comment