ADD

Sunday 6 March 2016

బయలుదేరనున్నాడు భగీరథుడు చారిత్రాత్మక ఒప్పందానికై....!

బయలుదేరనున్నాడు  భగీరథుడు చారిత్రాత్మక ఒప్పందానికై....!

తెలంగాణా జలప్రదాత,అభినవ భగీరథ,బంగారు తెలంగాణా నిర్మాత ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రాత్మక జల ఒప్పందానికై రేపు ముంబై బయలుదేరనున్నాడు. దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదాలకు చెక్ పెట్టడానికి గోదావరి పై తెలంగాణా చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తో అవగాహన కుదుర్చుకుని కుదుర్చుకుంటున్న ఒప్పందానికై రేపు ఉదయం 10.45కి హైదరాబాద్ నుండి బయలుదేరి మద్యాహ్నం 1గంటకి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు,రాత్రి రాజ్ భవన్ లో బస చేసి ఎల్లుండి ఉదయం 10.10కి సయాద్రి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. 10.15కి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవిస్ తో సమావేశం అయి చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసిన అనంతరం రాజ్ భవన్ చేరుకొని లంచ్ చేసిన అనంతరం మధ్యాహ్నం 2గంటలకి కెసిఆర్ హైదరాబాద్ బయలుదేరుతారు. 

No comments:

Post a Comment