ADD

Tuesday 8 March 2016

అద్బుతం,అద్వితీయం ఈ అఖండ స్వాగతం 'అపర భగీరథుడు'కి...!

అద్బుతం,అద్వితీయం ఈ అఖండ స్వాగతం 'అపర భగీరథుడు'కి...!

తెలంగాణా రథసారది,తెలంగాణా అపర భగీరథుడు కి మహారాష్ట్ర తో చారిత్రాత్మక ఒప్పందం అనంతరం హైదరాబాద్ చేరుకున్న తర్వాత తెలంగాణా ప్రజలు ఘన స్వాగతం పలికారు,డప్పు చప్పుళ్లు,కార్యకర్తల కోలాహలం,అశేష జనవాహిని నడుమ బేగంపేట్ నుండి అధికారిక నివాసం వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కెసిఆర్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో గోదావరిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిదిహెట్టి,పెన్ పహాడ్,రాజాపేట,మేడిగడ్డ బ్యారేజీలతో ఉత్తర తెలంగాణకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు పంటలకు సాగునీరు అందిస్తూ తెలంగాణాను సస్యస్యామలం చేయొచ్చని,ఈ బ్యారేజీల నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగు నీటిని అందిచడంతో నల్గొండ,మహా బూబ్ నగర్ జిల్లాలను సస్యస్యామలం అవుతాయని,జంట నగరాలకు తాగునీరు అందుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నప్పుడు తెలంగాణా సాదిన్చినపుడు ఎంత సంతోషం కలిగిందో అంతకు మిక్కిలి సంతోషం కలిగిందని కెసిఆర్ అన్నారు. ఈ ఒప్పందం పట్ల ఎమ్మెల్యేలు,ఎంపి లు,ప్రజలు హర్షాతిరేకాలు తెలిపారు. 

No comments:

Post a Comment