ADD

Monday 7 March 2016

మంత్రివర్గ సమావేశంలోని కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలోని కీలక నిర్ణయాలు 


సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పటికే ప్రతిష్టాత్మక టిఎస్ఐపాస్ తీసుకొచ్చిన తెలంగాణా ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ఐటీ,మైనింగ్,కల్చరల్ పాలసీ పై క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్టీసి ని ఆదుకునేందుకు తీసుకునే 500కోట్ల రుణంపై పూచికత్తు ఉండాలని నిర్ణయించారు,హైదరాబాద్లో లక్ష సీసీ కెమేరాల ఏర్పాటు,కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్రాహ్మణ కార్పోరేషన్ కు 100కోట్ల కేటాయింపు,రాష్ట్రంలో సెప్టెంబర్ నాటికి 44ఈ-మార్కెట్లు ఏర్పాట్లు,మహబూబ్ నగర్ లో పిషరీస్ అకాడమీ ఏర్పాటు ,ఐఏఎస్ అధికారుల సంఘానికి మూడెకరాల స్థలం కేటాయింపు,జీహెచ్ఎమ్సీ లో విలీనమైన 12శివారు మున్సిపాలిటీలకు తాగునీరు ,మౌలిక వసతుల కల్పనకు హడ్కో నుంచి రుణం తీసుకునుటకు,మార్కెట్ కమిటీల ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణా లో గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందానికి అంగీకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవిస్ కి రాష్ట్ర మంత్రివర్గం అభినందనలు తెలిపింది . 

No comments:

Post a Comment