ADD

Monday 29 February 2016

కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశాలతో టెట్ వాయిదా...!

కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశాలతో టెట్ వాయిదా...!


కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ ఆదేశాల మేరకు తెలంగాణా ప్రభుత్వం టెట్ నిర్వహణను వాయిదా వేసింది. టెట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎదురుచూపులు మిగిల్చింది కేంద్ర నిర్ణయం. దేశవ్యాప్తంగా టెట్ నిర్వాహణ తీరుపై అధ్యయనం చేయదలచిన మానవవనరుల అభివృద్ధి శాఖ టెట్ నిర్వాహణ అధ్యయనానికి అయిదుగురు సభ్యులతో కమిటీ వేసి మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణా లో టెట్ నిర్వాహణ మే నెల తర్వాతనే జరగనుంది,దీంతో తెలంగాణా డీఎస్సి నిర్వహణ మరింత ఆలస్యం కానుంది. రెండు రోజుల క్రితం తెలంగాణా విద్యాశాఖ టెట్ షెడ్యూల్డ్ విడుదలతో ఆనంద పడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిల్చింది. 

No comments:

Post a Comment