ADD

Saturday 5 March 2016

మురికి 'మూసీనది'... ఇక గత 'జీవనది'లా...

మురికి 'మూసీనది'... ఇక గత 'జీవనది'లా... 



 మురుగు కాల్వగా నేటి తరం మదిలో ముద్రపడిన ఒకప్పుడు జంటనగరాల దాహార్తిని తీర్చిన జీవ నది అయిన మూసి నదిని ప్రక్షాళన గావించి జీవం కోల్పోతున్న నదికి పునర్జీవం పోసి ఒకప్పటిలా చారిత్రక వైభవం కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. 60ఏళ్ల ఆదిపత్య పాలనలో కబ్జాకు గురైన మూసి నాలాలను ప్రక్షాళన గావించి 850కోట్ల రూపాయలతో జంట నగరాల మురుగునీరు మూసి లోకి రాకుండా నిరోదించి,మూసి నదిని ప్రక్షాళన గావించి, 750కోట్లతో మూసినధిని సుందరీకరించి,నదీ తీరాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దటానికి మూసి వెంట భాపుఘాట్ నుండి నాగోల్ వరకు 42కిలోమీటర్ల పొడవునా పాదచారుల వే,సైక్లింగ్ ట్రాక్ ,గ్రీన్ వే,మూసి నదిపై పాదచారుల వంతెన నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ఇందులో బాగంగా పురపాలక ,పట్టణ అభివృద్ధి శాఖా మాత్యులు కేటిఅర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఈ నెల తొమ్మిదిన ముంబై లో నాబార్డ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నోడల్ ఏజెన్సీ తో బేటీ అవనున్నారు.

No comments:

Post a Comment