ADD

Wednesday 2 March 2016

తెలుగు రాష్ట్రాల్లో బలోపేతానికి కమలం కసరత్తు;ఓ వైపు సిఎం అభ్యర్థిగా చిరంజీవి???

తెలుగు రాష్ట్రాల్లో బలోపేతానికి కమలం కసరత్తు;ఓ వైపు సిఎం అభ్యర్థిగా చిరంజీవి???

గత ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల ప్రజలు బిజేపీ కి సానుకూలంగానే ఉన్నప్పటికీ పొత్తులతో పుంజుకొని బిజేపీ 2019ఎన్నికల్లో సత్తా చాటటానికి కసరత్తు మొదలెట్టింది. తెలంగాణాలో అందపాతాలంలోకి వెళ్ళిన టిడిపి కంటే అధికారంలో ఉన్న టిఅరేస్ తో ఉంటేనే మేలని భావిస్తున్న బిజేపీ వర్గాలు టిడిపి తో పొత్తులు తెగదెమ్పుల్లొ బాగంగా వరంగల్ లో ఒంటరి పోరు చేస్తూ కేంద్ర క్యాబినెట్ లోకి టిఅరేస్ కి ఆహ్వాన సంకేతాలు పంపిస్తుంది. 2019ఎన్నికల్లో టిఅరేస్ తో పొత్తు లేదా అవగాహనతో తెలంగాణాలో ముందుకెళ్లి సత్తా చాటాలని ప్రణాళిక సిద్దం చేస్తుంది. 
ఆంధ్రలో 2019ఎన్నికలకు ముందు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి,చిరంజీవిని కాంగ్రెస్ నుండి బిజేపీ లోకి తీసుకుని బలమైన కాపు సామాజిక వర్గం అండతో చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జనసేన అధినేత పవన్ తో పొత్తుతో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మున్డుకేల్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తూ దక్షిణ భారతంలో బిజేపీ హవాకి బలమైన పునాదులు వేయాలని వ్యూహ రచన చేస్తుంది. 



No comments:

Post a Comment