ADD

Thursday 3 March 2016

మహాసాదకుడు చాణఖ్య చంద్రశేఖరుడు;అంతరాష్ట్ర జలవివాదాలకు తొలి చెక్

మహాసాదకుడు చాణఖ్య చంద్రశేఖరుడు;అంతరాష్ట్ర జలవివాదాలకు తొలి చెక్ 

ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అంతరాష్ట్ర జలవివాదాల సమస్యకు ఎందరో ముఖ్యమంత్రులు ,ఎందరో కేంద్రమంత్రులు ,కేంద్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపాలని చేసిన విపల ప్రయత్నాలకు చెక్ పెడుతూ రెండు సంవత్సరాల కాలంలోనే చర్చలు సపలం చేసి ఒప్పందాలకు సిద్దమై మహారాష్ట్ర -తెలంగాణా గోదావరి జల వివాదాలకు తెరదించిన మహాసాదకుడు కెసిఆర్. గత ఏడాది కాలంలో పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణా ప్రభుత్వం ,కెసిఆర్,హరీష్ రావు,నీటిపారుదల శాఖ అధికారులు జరిపిన చర్చల పలితంగా గోదావరిపై తెలంగాణా నిర్మించనున్న బ్యారేజీలకు మహారాష్ట్ర తో ఒప్పందానికి ముహూర్తం కుదిరింది. అంతరాష్ట్ర సమస్యలు ,వివాదాలకు తావులేకుండా తెలంగాణా చేపడుతున్న తుమ్మిడిహట్టి,మేటిగడ్డ,కాళేశ్వరం మొదలగు అయిదు ఆనకట్టల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడానికి రావలసిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఫోన్ చేసి ఆహ్వానించారు. పడ్నవిస్ ఆహ్వానం మేరకు ఈ నెల 7న ముఖ్యమంత్రి కెసిఆర్ ,నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు,నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ముంబై వెళ్లనున్నారు. 8న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరగనుంది. మేడి గడ్డ ,తుమ్మిడిహెట్టి ,చనఖ-కొరాట,రాజుపేట,పెన్ పహాడ్ ఆనకట్టల నిర్మాణంలో ఈ ఒప్పందం కీలకం కానుంది. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న జలసమస్యకు పరిష్కారానికి కెసిఆర్ చంద్రశేఖర్ చానఖ్యం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్షం కానుంది 

No comments:

Post a Comment