ADD

Wednesday 2 March 2016

చంద్రశేఖర చక్రవ్యూహం లో ప్రతిపక్షాలు ; ప్రజా సమస్యలపై చర్చకు లైన్ క్లియర్

చంద్రశేఖర చక్రవ్యూహం లో ప్రతిపక్షాలు

ప్రజా సమస్యలపై చర్చకు లైన్ క్లియర్ 

శాసన సభలో రచ్చ లేకుండా ప్రజా సమస్యలపై చర్చిస్తూ ప్రజా సమస్యలకు సభలోనే పరిష్కారం కనుగొనేందుకు ప్రతిపక్షాలను కెసిఆర్ తన చక్రవ్యూహం లో బంధించాడు. గవర్నర్ ప్రసంగం నుండి సభ చర్చలవరకు కఠిన తర నిబందనలతో సభా సమయం వృదా కానీయకుండా ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశ పరిచిన ప్రభుత్వం ప్రతిపక్షాల సాక్షిగా గవర్నర్ ప్రసంగం అడ్డుకున్న,అనవసర విషయాలతో సభను అడ్డుకున్నా,సభలో ప్లకార్డులతో ,నిషేధిత వస్తువులతో నిరసనలు ,గందరగోళం సృష్టిస్తే ,నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ఏడాది పాటు సస్పెన్షన్ చేయొచ్చని,కఠిన చర్యలు తీసుకోవచ్చని,సభలో అనవసర ,నిరాధార ఆరోపణలు ,వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభా చర్చలకు ఆటంకం కల్పించినా చర్యలు తీసుకోవచ్చని  రూల్స్ కమిటీలో చర్చించిన ప్రభుత్వం ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు కెసిఆర్ కసరత్తు పూర్తి చేసారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రతిపక్ష టిడిపి ని లేకుండానే చేసిన కెసిఆర్ సభను సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. 

No comments:

Post a Comment