ADD

Tuesday 1 March 2016

లంకను దాటి ఫైనల్లో అడుగిడిన భారత్

లంకను దాటి ఫైనల్లో అడుగిడిన భారత్ 

                 బంగ్లాదేశ్ డాకా షేర్ ఏ బంగ్లా స్టేడియం లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 5వికెట్ల తేడాతో విజయం సాదించి లంకను దాటి భారత్ ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పాండ్య 2/26,అశ్విన్ 2/26,భూమ్ర 2/27సూపర్ బౌలింగ్ తో శ్రీలంక ను 20ఓవర్లలో 138/9కి కట్టడి చేయగలిగింది. కపుగేదేరా 32బంతుల్లో 30,సిరివర్దన 17బంతుల్లో 22పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. 
            139పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కులశేకర 2/21పదునైన బౌలింగ్ తో ఆరంబం లోనే ధావన్(1)రోహిత్ 11పరుగులకే వెనుదిరిగినా కోహ్లి 47బంతుల్లో 56,యువరాజ్ 18బంతుల్లో 35,రైనా 26బంతుల్లో 25 సమయోచిత బ్యాటింగ్ తో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించింది. చాలా రోజులుగా పూర్వపు ఫామ్ అందుకోలేకపోతున్న యువరాజ్ ఈ మ్యాచ్ లో తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ 3పొర్లు,3సిక్షర్స్ తో 35పరుగులు చేయడం విశేషం. అర్ద సెంచరీ తో రాణించిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 

No comments:

Post a Comment