ADD

Thursday 3 March 2016

ఎర్రగడ్డ లో తెలంగాణా నూతన సచివాలయం....!

ఎర్రగడ్డ లో తెలంగాణా నూతన సచివాలయం....!

తెలంగాణా నూతన సచివాలయాన్ని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని కేంద్ర సచివాలయం నార్త్,సౌత్ బ్లాక్ తరహాలో నిర్మించాలని సచివాలయం లో తూర్పు ముఖంగా సిఎం ఆఫీస్,రెండు వైపుల మంత్రులు,అధికారుల కార్యాలయాలు ఉండేలా 15రోజుల్లో తెలంగాణా సంప్రదాయ ఆకృతిలో నమూనాలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులతో ఆర్కిటెక్ట్ హఫీజ్,సిబ్బంది బేటీ అయ్యారు. 48ఎకరాల్లో విస్తరించిన చాతి ఆస్పత్రి స్థలంలో ఎనిమిది అంతస్తులతో సచివాలయ భవనం మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం రెండు పక్కల మంత్రులు,అధికారుల కార్యాలయాలు,ఛాతి ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక ఆస్పత్రి తాలూకు 40ఎకరాల్లో అసెంబ్లీ ,మండలి లల కోసం భవనాలు వాటిని అనుసందానిస్తూ సెంట్రల్ హాల్ నిర్మాణానికి ఇప్పటికే హఫీజ్ డిజైన్ రూపొందించగా వాటికి కొన్ని మార్పులు సూచించిన కెసిఆర్ నిర్ణయానికి అనుగుణంగా 15రోజుల్లో డిజైన్ రూపొందించి నెల రోజుల్లో నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. 

No comments:

Post a Comment